తిరుపతి స్థానికులకు రేపు దర్శన టోకెన్లు జారీ..
- February 08, 2025
తిరుపతి: తిరుపతి వాసులకు టీటీడీ ఈనెల 11న శ్రీవారి దర్శనం కల్పించనుంది. ఈ మేరకు ఆ దర్శన టికెట్ టోకెన్లను రేపు(ఫిబ్రవరి 9న) జారీ చేయనుంది.
అయితే స్థానికులకు శ్రీవారి దర్శన కోటా కింద ప్రతి నెలా మొదటి మంగళవారం టోకెన్లు జారీ చేస్తుండగా..ఈ నెలలో రథసప్తమి కారణంగా రెండో మంగళవారానికి టీటీడీ వాయిదా వేడింది.
రేపు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు జారీ చేస్తారు. దర్శనం కోటా టోకెన్లు పొందిన భక్తులకు ఫిబ్రవరి 11న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు.
అయితే స్థానికులకు శ్రీవారి దర్శన కోటా టోకెన్ల కోసం వచ్చే భక్తులు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని టీటీడీ సూచించింది. అలాగే టోకెన్లు పొందిన తర్వాత దర్శనానికి వచ్చిన సమయంలోనూ ఆధార్ కార్డును వెంట ఉంచుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







