తిరుపతి స్థానికులకు రేపు దర్శన టోకెన్లు జారీ..
- February 08, 2025
తిరుపతి: తిరుపతి వాసులకు టీటీడీ ఈనెల 11న శ్రీవారి దర్శనం కల్పించనుంది. ఈ మేరకు ఆ దర్శన టికెట్ టోకెన్లను రేపు(ఫిబ్రవరి 9న) జారీ చేయనుంది.
అయితే స్థానికులకు శ్రీవారి దర్శన కోటా కింద ప్రతి నెలా మొదటి మంగళవారం టోకెన్లు జారీ చేస్తుండగా..ఈ నెలలో రథసప్తమి కారణంగా రెండో మంగళవారానికి టీటీడీ వాయిదా వేడింది.
రేపు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు జారీ చేస్తారు. దర్శనం కోటా టోకెన్లు పొందిన భక్తులకు ఫిబ్రవరి 11న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు.
అయితే స్థానికులకు శ్రీవారి దర్శన కోటా టోకెన్ల కోసం వచ్చే భక్తులు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని టీటీడీ సూచించింది. అలాగే టోకెన్లు పొందిన తర్వాత దర్శనానికి వచ్చిన సమయంలోనూ ఆధార్ కార్డును వెంట ఉంచుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!







