ఘనంగా ఇఫ్తార్ నిర్వహించిన తెలుగు దేశం పార్టి కువైట్

- July 01, 2016 , by Maagulf

కుదరవల్లి సుధాకర రావు అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ కువైట్  ముస్లిం సోదరుల కోసం హవల్లీ లోని అవంతి పాలస్ హోటల్ నందు ఘనంగా ఇఫ్తార్ ను నిర్వహించినది. ఇండియన్ ముస్లిం అసోసియెషన్ సభ్యులు, కువైట్ ముస్లిం వెల్ఫేర్ అసోసియెషన్ సభ్యులు మరియు వందల మంది ఇతర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

కొత్తపల్లి మోహన్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమములో ప్రముఖ సయెద్ అహ్మద్ ఉపన్యాసకుడుగా , ఇండియన్ ముస్లిం అసోసిఏషన్ ఉపాధ్యక్షుడు అంజాద్ ఖాన్ ముఖ్య అతిధిగా, ఫలాఏ మిలాత్ ముస్లిం వెల్ఫేర్ సొసయిటీ కార్యదర్సి మౌలానా రియాజ్ విశిష్ట అతిధిగా మరియు తెలుగు దేశం కువైట్ అదికార ప్రతినిది రహమతుల్ల, మైనారిటీ నాయకుడు షేక్ బాషాతో పాటు ప్రధాన కార్యదర్సి నాగేంద్ర బాబు, అధ్యక్షులు సుధాకర రావు వేదికనలంకరించారు. అంజాద్ ఖాన్ గారి ఖురాన్ పటనముతో మొదలయిన సభలో  సయెద్ అహ్మద్ గారి ఉపన్యాసము అందరిని అలరించినది. అధ్యక్షులు సుధాకర రావు మట్లాడుతూ తెలుగు దేశం పార్టి ఇండియాలొను కువైట్ లోను ముస్లిం సొదరుల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అధికార ప్రతినిది రహమతుల్లా గారు మాట్లాడుతూ తనకు గత పది సంవత్సరములుగా పార్టీతో వున్న అనుబందాన్ని గుర్తుచేసుకున్నారు. నాగేంద్ర బాబుగారు కార్యక్రమానికి విచ్చెసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలియ చేసారు. తెలుగు దేశం కువైట్ కార్యవర్గం అతిధులను ఘనంగా సన్మానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com