ఘనంగా ఇఫ్తార్ నిర్వహించిన తెలుగు దేశం పార్టి కువైట్
- July 01, 2016
కుదరవల్లి సుధాకర రావు అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ కువైట్ ముస్లిం సోదరుల కోసం హవల్లీ లోని అవంతి పాలస్ హోటల్ నందు ఘనంగా ఇఫ్తార్ ను నిర్వహించినది. ఇండియన్ ముస్లిం అసోసియెషన్ సభ్యులు, కువైట్ ముస్లిం వెల్ఫేర్ అసోసియెషన్ సభ్యులు మరియు వందల మంది ఇతర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి మోహన్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమములో ప్రముఖ సయెద్ అహ్మద్ ఉపన్యాసకుడుగా , ఇండియన్ ముస్లిం అసోసిఏషన్ ఉపాధ్యక్షుడు అంజాద్ ఖాన్ ముఖ్య అతిధిగా, ఫలాఏ మిలాత్ ముస్లిం వెల్ఫేర్ సొసయిటీ కార్యదర్సి మౌలానా రియాజ్ విశిష్ట అతిధిగా మరియు తెలుగు దేశం కువైట్ అదికార ప్రతినిది రహమతుల్ల, మైనారిటీ నాయకుడు షేక్ బాషాతో పాటు ప్రధాన కార్యదర్సి నాగేంద్ర బాబు, అధ్యక్షులు సుధాకర రావు వేదికనలంకరించారు. అంజాద్ ఖాన్ గారి ఖురాన్ పటనముతో మొదలయిన సభలో సయెద్ అహ్మద్ గారి ఉపన్యాసము అందరిని అలరించినది. అధ్యక్షులు సుధాకర రావు మట్లాడుతూ తెలుగు దేశం పార్టి ఇండియాలొను కువైట్ లోను ముస్లిం సొదరుల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అధికార ప్రతినిది రహమతుల్లా గారు మాట్లాడుతూ తనకు గత పది సంవత్సరములుగా పార్టీతో వున్న అనుబందాన్ని గుర్తుచేసుకున్నారు. నాగేంద్ర బాబుగారు కార్యక్రమానికి విచ్చెసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలియ చేసారు. తెలుగు దేశం కువైట్ కార్యవర్గం అతిధులను ఘనంగా సన్మానించారు.







తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









