ఘనంగా ఇఫ్తార్ నిర్వహించిన తెలుగు దేశం పార్టి కువైట్
- July 01, 2016
కుదరవల్లి సుధాకర రావు అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ కువైట్ ముస్లిం సోదరుల కోసం హవల్లీ లోని అవంతి పాలస్ హోటల్ నందు ఘనంగా ఇఫ్తార్ ను నిర్వహించినది. ఇండియన్ ముస్లిం అసోసియెషన్ సభ్యులు, కువైట్ ముస్లిం వెల్ఫేర్ అసోసియెషన్ సభ్యులు మరియు వందల మంది ఇతర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి మోహన్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమములో ప్రముఖ సయెద్ అహ్మద్ ఉపన్యాసకుడుగా , ఇండియన్ ముస్లిం అసోసిఏషన్ ఉపాధ్యక్షుడు అంజాద్ ఖాన్ ముఖ్య అతిధిగా, ఫలాఏ మిలాత్ ముస్లిం వెల్ఫేర్ సొసయిటీ కార్యదర్సి మౌలానా రియాజ్ విశిష్ట అతిధిగా మరియు తెలుగు దేశం కువైట్ అదికార ప్రతినిది రహమతుల్ల, మైనారిటీ నాయకుడు షేక్ బాషాతో పాటు ప్రధాన కార్యదర్సి నాగేంద్ర బాబు, అధ్యక్షులు సుధాకర రావు వేదికనలంకరించారు. అంజాద్ ఖాన్ గారి ఖురాన్ పటనముతో మొదలయిన సభలో సయెద్ అహ్మద్ గారి ఉపన్యాసము అందరిని అలరించినది. అధ్యక్షులు సుధాకర రావు మట్లాడుతూ తెలుగు దేశం పార్టి ఇండియాలొను కువైట్ లోను ముస్లిం సొదరుల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అధికార ప్రతినిది రహమతుల్లా గారు మాట్లాడుతూ తనకు గత పది సంవత్సరములుగా పార్టీతో వున్న అనుబందాన్ని గుర్తుచేసుకున్నారు. నాగేంద్ర బాబుగారు కార్యక్రమానికి విచ్చెసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదములు తెలియ చేసారు. తెలుగు దేశం కువైట్ కార్యవర్గం అతిధులను ఘనంగా సన్మానించారు.







తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









