మెరీమెరీనా టవర్లో మూడోసారి అగ్నిప్రమాదం..నెటిజన్ల పోస్టులు వైరల్..!!
- February 10, 2025
యూఏఈ: దుబాయ్ మెరినాలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దాంతో నివాస భవనాన్ని ఖాళీ చేయించారు. అధికారులు మంటలను వెంటనే అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దుబాయ్ మెరీనాలోని 81 అంతస్తుల టవర్లో అగ్నిప్రమాదం జరగడం ఇది మూడోసారి.
ప్రత్యక్ష సాక్షులు, సోషల్ మీడియా పోస్ట్ల ప్రకారం.. భవన లాబీని దట్టమైన పొగ చుట్టుముట్టింది. సైరన్లతో ఫైర్ రెస్స్యూ సిబ్బంది తరలివచ్చారు. నివాసితులను ఖాళీ చేయమని అత్యవసరంగా హెచ్చరించారు. కొంతమంది నివాసితులు తమ ప్రాణాలను కాపాడుకోవసం కోసం అనేక అంతస్తుల పైనుండి పరుగులు పెడుతూ కిందకు వచ్చారు. సందడిగా ఉండే ఈ ప్రాంతంలో రిటైల్ అవుట్లెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, నివాస భవనాలు ఉన్నాయి. నెటిజన్లు తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సులాఫా టవర్ నివాసి లోరిజా ఇలియాని టిక్టాక్లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. “ఇది రాత్రి 11.51 గంటలు.మేము భవనంలోకి తిరిగి వెళ్ళలేము. నేను 46 అంతస్తుల క్రిందకు పరిగెత్తాను. నా కాళ్ళు వణుకుతున్నాయి. అధికారుల నుండి క్లియరెన్స్ వచ్చే వరకు మమ్మల్ని తిరిగి లోపలికి అనుమతించనందున నేను భవనం చుట్టూ తిరుగుతున్నాను. ” అని పేర్కొన్నారు. ఒక Reddit కస్టమర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. “మేము క్రిందికి వెళుతున్నప్పుడు 13వ అంతస్తు నుండి పొగ వచ్చింది. అర్ధరాత్రి సమయంలో పై అంతస్తులలోని హాలులో పొగ నిండిపోయిందని పోలీసులు మాకు చెప్పారు. కాబట్టి వారు మమ్మల్ని తిరిగి లోపలికి రానివ్వలేదు. తెల్లవారుజామున 2 గంటలకు తిరిగి అపార్ట్మెంట్లలోకి అనుమతించారు.’’ అని తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!







