ఇండియాలో ‘ఓపాజ్’ ప్రతినిధి బృందం పర్యటన..!!
- February 10, 2025
మస్కట్: ఒమన్, ఇండియా మధ్య ఆర్థిక, స్వేచ్ఛా, పారిశ్రామిక జోన్ల రంగంలో సహకారాన్ని పెంపొందించడం, పెట్టుబడులను ఆకర్షించడం, నైపుణ్యం, అనుభవాల షేరింగ్ అవకాశాలపై చర్చించే లక్ష్యంతో పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అథారిటీ.. ఇండియాలో పర్యటించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఫ్రీ జోన్ల వైస్ ఛైర్మన్ హిస్ ఎక్సలెన్సీ ఇంజినీర్ అహ్మద్ బిన్ హసన్ అల్-ధీబ్ నేతృత్వంలోని అథారిటీ ప్రతినిధి బృందం.. అంగుల్లోని జిందాల్ ఐరన్ అండ్ స్టీల్ గ్రూప్ ప్రాజెక్ట్ల వంటి అనేక భారతీయ పారిశ్రామిక, ఆర్థిక కంపెనీలు, సంస్థలను సందర్శించారు. జిందాల్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ, విద్యా కార్యక్రమాలు, పరిశోధనా కేంద్రాలు, విద్యా మ్యూజియం, సేవా విద్యా సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇండియాలోని ఒమన్ రాయబార కార్యాలయం.. పబ్లిక్ అథారిటీ సహకారంతో రెండు స్నేహపూర్వక దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపన 70వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వివిధ రకాల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలలో పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు అందించిన ప్రోత్సాహకాలు, అత్యంత ప్రముఖమైన లక్ష్య రంగాలను సమీక్షించే వర్కింగ్ పేపర్ను హిజ్ ఎక్సలెన్సీ అథారిటీ వైస్ చైర్మన్ అహ్మద్ బిన్ హసన్ అల్-ధీబ్ విడుదల చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను వివరించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంలో ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఫ్రీ జోన్లు, పారిశ్రామిక నగరాల పాత్రను అదే సమయంలో ఒమన్ సుల్తానేట్లో పెట్టుబడి అవకాశాలను హిస్ ఎక్స్లెన్సీ వివరించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







