దుబాయ్లో 1.2 టన్నుల డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- February 11, 2025
దుబాయ్: దుబాయ్ కస్టమ్స్ 1.2 టన్నుల సైకోయాక్టివ్ పదార్థాలను ఎయిర్ కార్గో సరుకులో అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. వీటిని ఎమిరేట్ ఎయిర్ పోర్ట్ గుండా వెళుతుండగా, ప్రత్యేక బృందాలు తాజా భద్రతా టెక్నాలజీలను ఉపయోగించి గుర్తించగలిగారు. ఎక్స్లోని సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. ఖచ్చితమైన డేటా విశ్లేషణ, షిప్మెంట్ వివరాల పరిశీలన ద్వారా డ్రగ్స్ ను గుర్తించారు.
దుబాయ్ కస్టమ్స్ బృందాలు షిప్మెంట్లోని నిషేధిత పదార్థాలను గుర్తించాయి. సంబంధిత అధికారులతో సమన్వయంతో చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు కస్టమ్ అధికారులు తెలిపారు. దుబాయ్ కస్టమ్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న పోర్ట్స్, కస్టమ్స్, ఫ్రీ జోన్ కార్పొరేషన్ ద్వారా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని DP వరల్డ్ గ్రూప్ చైర్మన్.. పోర్ట్స్, కస్టమ్స్, ఫ్రీ జోన్ కార్పొరేషన్ చైర్మన్ సుల్తాన్ బిన్ సులేయం వెల్లడించారు. ఈ సందర్భంగా కస్టమ్స్ తనిఖీ బృందాలను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









