తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ
- February 11, 2025
తిరుమల: తిరుమలలో నిన్నటితో పోల్చితే భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది.ఇవాళ టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం(నిన్న 15గంటలు) పడుతోంది.వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.నిన్న శ్రీవారిని 70,169 మంది దర్శించుకోగా,వారిలో 24,559 మంది తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో..తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గో మందిరం వరకు వాహనాలు బారులు తీరాయి.అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది. టీటీడీ అధికారులు చర్యలు చేపట్టి వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు.
తాజా వార్తలు
- హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం..
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ









