తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

- February 11, 2025 , by Maagulf
తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో నిన్నటితో పోల్చితే భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది.ఇవాళ టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం(నిన్న 15గంటలు) పడుతోంది.వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 23 కంపార్టు‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.నిన్న శ్రీవారిని 70,169 మంది దర్శించుకోగా,వారిలో 24,559 మంది తలనీలాలు సమర్పించారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలిరావడంతో..తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గో మందిరం వరకు వాహనాలు బారులు తీరాయి.అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగిపోవడంతో వాహనాల తనిఖీ ఆలస్యమవుతోంది. టీటీడీ అధికారులు చర్యలు చేపట్టి వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com