పేరెంట్స్ పై దురుసు ప్రవర్తన.. ప్రైవేట్ స్కూల్ పై కేసు నమోదు..!!
- February 11, 2025
మనామా: విద్యార్థి తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై విద్యా మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఇన్వెస్టిగేషన్ల ఆధారంగా.. పాఠశాల యాజమాన్యాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడానికి ఒక నివేదిక సిద్ధం చేశారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. స్కూల్ మేనేజ్ మెంట్ అనధికారిక పద్ధతుల్లో నిమగ్నమై, సంబంధిత నియంత్రణ సంస్థను సంప్రదించకుండా బహిష్కరణతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులపై బెదిరింపులకు దిగారు. నిర్దేశిత నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా ఉండేలా విద్యా సంస్థలపై అవసరమైన పర్యవేక్షణను నిర్వహించాలని అధికారులకు మంత్రిత్వ శాఖ వెల్లించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సిబ్బంది హక్కులను రక్షించడాన్ని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







