పేరెంట్స్ పై దురుసు ప్రవర్తన.. ప్రైవేట్ స్కూల్ పై కేసు నమోదు..!!
- February 11, 2025
మనామా: విద్యార్థి తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై విద్యా మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఇన్వెస్టిగేషన్ల ఆధారంగా.. పాఠశాల యాజమాన్యాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడానికి ఒక నివేదిక సిద్ధం చేశారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. స్కూల్ మేనేజ్ మెంట్ అనధికారిక పద్ధతుల్లో నిమగ్నమై, సంబంధిత నియంత్రణ సంస్థను సంప్రదించకుండా బహిష్కరణతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులపై బెదిరింపులకు దిగారు. నిర్దేశిత నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా ఉండేలా విద్యా సంస్థలపై అవసరమైన పర్యవేక్షణను నిర్వహించాలని అధికారులకు మంత్రిత్వ శాఖ వెల్లించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సిబ్బంది హక్కులను రక్షించడాన్ని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- భగీరథ్ కు 14 రోజుల రిమాండ్..చర్లపల్లి జైలుకు తరలింపు
- మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో..కుదిరిన కీలక డీల్
- కువైట్లో ఘనంగా NRI TDP మహానాడు వేడుకలు
- హోర్ముజ్ లో ఇరాన్ దాడులు..ఐఎంఓ అధిపతితో లానా నుస్సేబే చర్చలు..!!
- 19 భాషలు, 1,300 డిజిటల్ సేవలతో యాత్రికులకు మద్దతు ..!!
- మార్కెట్లో నకిలీ వస్తువులు..వాణిజ్య మంత్రిత్వ శాఖ స్వాధీనం!!
- 2026-2027 రెసిడెన్సీ ప్రోగ్రామ్..దరఖాస్తులకు ఆహ్వానం..!!
- ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు కార్లలో నిద్రపోవద్దు..అలెర్ట్ జారీ..!!
- సురక్షితమైన భోజనం, ఆహార తయారీ పై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ అలెర్ట్..!!
- తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్..ఎవరికి ఏ శాఖ?









