పేరెంట్స్ పై దురుసు ప్రవర్తన.. ప్రైవేట్ స్కూల్ పై కేసు నమోదు..!!
- February 11, 2025
మనామా: విద్యార్థి తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై విద్యా మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఇన్వెస్టిగేషన్ల ఆధారంగా.. పాఠశాల యాజమాన్యాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడానికి ఒక నివేదిక సిద్ధం చేశారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. స్కూల్ మేనేజ్ మెంట్ అనధికారిక పద్ధతుల్లో నిమగ్నమై, సంబంధిత నియంత్రణ సంస్థను సంప్రదించకుండా బహిష్కరణతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులపై బెదిరింపులకు దిగారు. నిర్దేశిత నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా ఉండేలా విద్యా సంస్థలపై అవసరమైన పర్యవేక్షణను నిర్వహించాలని అధికారులకు మంత్రిత్వ శాఖ వెల్లించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సిబ్బంది హక్కులను రక్షించడాన్ని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







