రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- February 13, 2025
న్యూ ఢిల్లీ: ఈరోజు ఢిల్లీలో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని రోడ్ల విషయమై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు మరియు జనసేన పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ వల్లభనేని బాల శౌరి కలవడం జరిగింది.
నూతనంగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్ట్ కి అనుసంధానంగా మచిలీపట్నం సౌత్ పోర్ట్ నుండి నేషనల్ హై వే 65 కు కలుపుతూ 18.5 కి. మీ మేర 4 వరసల గ్రీన్ ఫీల్డ్ రోడ్ గా అభివృద్ధి పరచవలసి నదిగా కోరడమైనది. అలాగే మంగినపూడి బీచ్ నుండి పోర్ట్ వరకు సుమారు 12 కి. మీ మేర 4 వరసల రహదారిని అభివృద్ధి పరచవలసి నదిగా కోరడం జరిగింది.
అంతేకాకుండా పెడన గుడివాడ హనుమాన్ జంక్షన్ నూజివీడు లక్ష్మీపురం హై వే 216 H లో గుడివాడ మునిసిపల్ పరిధిలో 3.2 కి. మీ దూరం మేర రోడ్ ను నేషనల్ హై వే కి కలప వలసినదిగా ప్రత్యేకంగా కోరడం జరిగింది. ఈ 216 H నేషనల్ హై వే కాకినాడ మరియు మచిలీపట్నం పోర్ట్ లకు ఎంతగానో ఉపయోగ పడుతుందని, భారతదేశం యొక్క ఆర్ధికాభివృద్ధి కి తోడ్పడే కృష్ణా గోదావరి బేసిన్ లోని సహజ వాయువుల నిక్షేపాలను వెలికి తీసే ONGC, GAIL, రిలయన్స్ పెట్రోలియం వంటి సంస్థల కార్యకలాపాలకు ఈ రోడ్ ఎంతో ఊతం ఇస్తుందని, ఇటువంటి ప్రధాన మైన రోడ్ గుడివాడనుండి వెళుతుందని, 3.2 కి. మీ మేర ఈరోడ్ ను 216 H కి లింక్ చేయవలసినదిగా కోరడం జరిగింది.
ఎంపీ స్వయంగా చెప్పిన విషయాలను అర్ధం చేసుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఈ విషయం లో వెంటనే తగు చర్యలు తీసుకునవలసినదిగా అధికారులను ఆదేశించడం జరిగింది.
సమస్యలపై వెంటనే స్పందించిన కేంద్ర మంత్రికి ఎంపీ గారు కృతజ్ఞతలు వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







