కువైట్ దౌత్యవేత్తలకు ఇండియాలో శిక్షణ..!!
- February 14, 2025
కువైట్: భారతదేశంలోని కువైట్ రాయబారి మిషాల్ ముస్తఫా అల్-షెమాలి.. షేక్ సౌద్ అల్-నాసర్ అల్-సబా డిప్లొమాటిక్ ఇన్స్టిట్యూట్, సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు. సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ డీన్ రాజ్ కుమార్ శ్రీవాస్తవను ఆయన కలిసారు. అనంతరం మాట్లాడుతూ.. దౌత్య రంగంలో అత్యుత్తమ శిక్షణ పద్ధతులు, విద్యను మార్పిడి చేయడం, రెండు సంస్థల విధులు, కార్యకలాపాలను పంచుకోవడం ద్వారా కువైట్ - భారతీయ సంస్థల మధ్య సంబంధాలలను ప్రోత్సహించడంపై చర్చించారు.
ఈ సమావేశంలో ఈ నెలలో ఇండియన్ సుష్మా స్వరాజ్ డిప్లొమాటిక్ ఇన్స్టిట్యూట్లో జరిగే డిప్లమాటిక్ కోర్సులో కువైట్ బృందం పాల్గొనడం, దానికి సంబంధించిన ఏర్పాట్లపై తాను దృష్టి సారించినట్లు రాయబారి తెలిపారు. షేక్ సౌద్ అల్-నాసర్ అల్-సబాహ్ డిప్లొమాటిక్ ఇన్స్టిట్యూట్ - సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ మధ్య 2013లో దౌత్య జ్ఞాన మార్పిడి రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి, ప్రత్యేక కార్యక్రమాలు, కోర్సులు, వివిధ విద్యా కార్యకలాపాల నిర్వహణలో పాల్గొనేందుకు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. డిసెంబరు 2024లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా, ఢిల్లీలోని భారత సుష్మా స్వరాజ్ డిప్లొమాటిక్ ఇన్స్టిట్యూట్లో కువైట్ దౌత్యవేత్తలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







