కువైట్ దౌత్యవేత్తలకు ఇండియాలో శిక్షణ..!!

- February 14, 2025 , by Maagulf
కువైట్ దౌత్యవేత్తలకు ఇండియాలో శిక్షణ..!!

కువైట్: భారతదేశంలోని కువైట్ రాయబారి మిషాల్ ముస్తఫా అల్-షెమాలి.. షేక్ సౌద్ అల్-నాసర్ అల్-సబా డిప్లొమాటిక్ ఇన్‌స్టిట్యూట్, సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు. సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ డీన్ రాజ్ కుమార్ శ్రీవాస్తవను ఆయన కలిసారు. అనంతరం  మాట్లాడుతూ.. దౌత్య రంగంలో అత్యుత్తమ శిక్షణ పద్ధతులు, విద్యను మార్పిడి చేయడం, రెండు సంస్థల విధులు, కార్యకలాపాలను పంచుకోవడం ద్వారా కువైట్ - భారతీయ సంస్థల మధ్య సంబంధాలలను ప్రోత్సహించడంపై చర్చించారు.

ఈ సమావేశంలో ఈ నెలలో ఇండియన్ సుష్మా స్వరాజ్ డిప్లొమాటిక్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగే డిప్లమాటిక్ కోర్సులో కువైట్ బృందం పాల్గొనడం, దానికి సంబంధించిన ఏర్పాట్లపై తాను దృష్టి సారించినట్లు రాయబారి తెలిపారు. షేక్ సౌద్ అల్-నాసర్ అల్-సబాహ్ డిప్లొమాటిక్ ఇన్‌స్టిట్యూట్ - సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ మధ్య 2013లో దౌత్య జ్ఞాన మార్పిడి రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి, ప్రత్యేక కార్యక్రమాలు, కోర్సులు, వివిధ విద్యా కార్యకలాపాల నిర్వహణలో పాల్గొనేందుకు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. డిసెంబరు 2024లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా, ఢిల్లీలోని భారత సుష్మా స్వరాజ్ డిప్లొమాటిక్ ఇన్‌స్టిట్యూట్‌లో కువైట్ దౌత్యవేత్తలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com