భారతీయ పౌరులకు యూఏఈ గుడ్ న్యూస్..వీసా ఆన్ అరైవల్ విస్తరణ..!!
- February 15, 2025
అబుదాబి: భారతీయ పౌరులు కోసం తన వీసా ఆన్ - అరైవల్ కార్యక్రమాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరింత విస్తరించింది.ఆరు కొత్త దేశాల నుండి చెల్లుబాటు అయ్యే వీసాలు, నివాస అనుమతులు లేదా గ్రీన్ కార్డులు ఉన్న వారికి ఆన్-అరైవల్ వీసా ఇవ్వనుంది. ఫిబ్రవరి 13 నుండి అమల్లోకి వచ్చిన కొత్త విధానం ప్రకారం.. సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాల నుండి సాధారణ పాస్పోర్ట్లు, చెల్లుబాటు అయ్యే వీసాలు, నివాస అనుమతులు లేదా గ్రీన్ కార్డులు కలిగి ఉన్న భారతీయ పౌరులకు యూఏఈలో అడుగు పెట్టగానే వీసాలు మంజూరు చేస్తారు. ఇప్పటికే ఈ సదుపాయం ఉన్న యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్ డమ్ దేశాలకు ఇవి అదనం. ఈ మేరకు యూఏఈ-భారతదేశం మధ్య బలమైన సంబంధాన్ని హైలైట్ చేస్తూ, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్స్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్, సెక్యూరిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చొరవ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, అగ్రశ్రేణి ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, వ్యవస్థాపకులను ఆకర్షించడం, ప్రముఖ ప్రపంచ కేంద్రంగా యూఏఈ స్థానాన్ని మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది. కాగా దీనిని సద్వినియోగం చేసుకోవాలంటే ఆరు నెలల పాస్పోర్ట్ చెల్లుబాటు, నిర్దేశించిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







