దుబాయ్ లో రోజూ వందలాది సైకిళ్లు, ఈ-స్కూటర్లు సీజ్..!!
- February 18, 2025
యూఏఈ: దుబాయ్లోని నైఫ్ ప్రాంతంలోని వ్యాపారాలు సైకిళ్లు, ఇ-స్కూటర్లను ఉపయోగించడంపై మార్గదర్శకాలను కోరుతున్నారు. ఎందుకంటే అధికారులు రోజు వందల సంఖ్యలో వాటిని సీజ్ చేతున్నారు. సెప్టెంబరులో దుబాయ్ పోలీసులు నైఫ్లో దాదాపు 3,800 ఇ-స్కూటర్లు, సైకిళ్లను ఉల్లంఘనల కింద జప్తు చేసినట్లు చెప్పారు. రోడ్లు, పాదచారుల లేన్ల వంటి ప్రాంతాలలో ఉపయోగించడం నేరమని తెలిపారు. 2024 మొదటి ఆరు నెలల్లో దుబాయ్ అంతటా ఈ-స్కూటర్లు, సైకిళ్లతో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మరణించగా, 25 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
ఈ-స్కూటర్లు, సైకిల్ రైడర్లు అనుసరించాల్సిన నియమాలను అధికారులు గతంలో హైలైట్ చేశారు. లైసెన్సింగ్ అథారిటీ నిర్దేశించిన నిర్ణీత లేన్లలో ప్రయాణించడం, జాగింగ్ లేదా వాకింగ్ లేన్లను నివారించడం, బ్యాలెన్స్ను ప్రభావితం చేసే ప్రయాణీకులు లేదా వస్తువులను తీసుకెళ్లకపోవడం, ట్రాఫిక్కు వ్యతిరేకంగా రైడింగ్ చేయకపోవడం, పాదచారుల క్రాసింగ్ల వద్ద దిగడం మరియు సేఫ్టీ గేర్ ధరించడం వంటివి ఉన్నాయి. పబ్లిక్ రోడ్లపై ఉపయోగించడం , నిర్లక్ష్యపు రైడింగ్ వంటి పెనాల్టీలకు 300 దిర్హామ్ల వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









