దుబాయ్ లో రోజూ వందలాది సైకిళ్లు, ఈ-స్కూటర్లు సీజ్..!!
- February 18, 2025
యూఏఈ: దుబాయ్లోని నైఫ్ ప్రాంతంలోని వ్యాపారాలు సైకిళ్లు, ఇ-స్కూటర్లను ఉపయోగించడంపై మార్గదర్శకాలను కోరుతున్నారు. ఎందుకంటే అధికారులు రోజు వందల సంఖ్యలో వాటిని సీజ్ చేతున్నారు. సెప్టెంబరులో దుబాయ్ పోలీసులు నైఫ్లో దాదాపు 3,800 ఇ-స్కూటర్లు, సైకిళ్లను ఉల్లంఘనల కింద జప్తు చేసినట్లు చెప్పారు. రోడ్లు, పాదచారుల లేన్ల వంటి ప్రాంతాలలో ఉపయోగించడం నేరమని తెలిపారు. 2024 మొదటి ఆరు నెలల్లో దుబాయ్ అంతటా ఈ-స్కూటర్లు, సైకిళ్లతో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మరణించగా, 25 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
ఈ-స్కూటర్లు, సైకిల్ రైడర్లు అనుసరించాల్సిన నియమాలను అధికారులు గతంలో హైలైట్ చేశారు. లైసెన్సింగ్ అథారిటీ నిర్దేశించిన నిర్ణీత లేన్లలో ప్రయాణించడం, జాగింగ్ లేదా వాకింగ్ లేన్లను నివారించడం, బ్యాలెన్స్ను ప్రభావితం చేసే ప్రయాణీకులు లేదా వస్తువులను తీసుకెళ్లకపోవడం, ట్రాఫిక్కు వ్యతిరేకంగా రైడింగ్ చేయకపోవడం, పాదచారుల క్రాసింగ్ల వద్ద దిగడం మరియు సేఫ్టీ గేర్ ధరించడం వంటివి ఉన్నాయి. పబ్లిక్ రోడ్లపై ఉపయోగించడం , నిర్లక్ష్యపు రైడింగ్ వంటి పెనాల్టీలకు 300 దిర్హామ్ల వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







