దుబాయ్ లో రోజూ వందలాది సైకిళ్లు, ఈ-స్కూటర్లు సీజ్..!!
- February 18, 2025
యూఏఈ: దుబాయ్లోని నైఫ్ ప్రాంతంలోని వ్యాపారాలు సైకిళ్లు, ఇ-స్కూటర్లను ఉపయోగించడంపై మార్గదర్శకాలను కోరుతున్నారు. ఎందుకంటే అధికారులు రోజు వందల సంఖ్యలో వాటిని సీజ్ చేతున్నారు. సెప్టెంబరులో దుబాయ్ పోలీసులు నైఫ్లో దాదాపు 3,800 ఇ-స్కూటర్లు, సైకిళ్లను ఉల్లంఘనల కింద జప్తు చేసినట్లు చెప్పారు. రోడ్లు, పాదచారుల లేన్ల వంటి ప్రాంతాలలో ఉపయోగించడం నేరమని తెలిపారు. 2024 మొదటి ఆరు నెలల్లో దుబాయ్ అంతటా ఈ-స్కూటర్లు, సైకిళ్లతో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మరణించగా, 25 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
ఈ-స్కూటర్లు, సైకిల్ రైడర్లు అనుసరించాల్సిన నియమాలను అధికారులు గతంలో హైలైట్ చేశారు. లైసెన్సింగ్ అథారిటీ నిర్దేశించిన నిర్ణీత లేన్లలో ప్రయాణించడం, జాగింగ్ లేదా వాకింగ్ లేన్లను నివారించడం, బ్యాలెన్స్ను ప్రభావితం చేసే ప్రయాణీకులు లేదా వస్తువులను తీసుకెళ్లకపోవడం, ట్రాఫిక్కు వ్యతిరేకంగా రైడింగ్ చేయకపోవడం, పాదచారుల క్రాసింగ్ల వద్ద దిగడం మరియు సేఫ్టీ గేర్ ధరించడం వంటివి ఉన్నాయి. పబ్లిక్ రోడ్లపై ఉపయోగించడం , నిర్లక్ష్యపు రైడింగ్ వంటి పెనాల్టీలకు 300 దిర్హామ్ల వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







