ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- February 19, 2025
హైదరాబాద్: కథలు నిజ జీవితం ప్రతి బింబాలే నని నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు అన్నారు.శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ లేఖిని రచయిత్రులు వేదిక ఆధ్వర్యంలో కస్తూరి అలివేణి రచించిన ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ,వంశీ రామరాజు డాక్టర్ సుధా రామరాజు కు అంకిత మహోత్సవం సభ జరిగింది.ముఖ్యఅతిథిగా బైస దేవదాసు సంపుటిని ఆవిష్కరించి మాట్లాడుతూ... వాస్తవిక వున్న కథలు కాల పరీక్షకు నిలబడతాయి అని అలువేణి చెప్పిన కధలు సమాజంలో జరిగే సంఘటనలను అద్దంలో చూపాయి అని ఉదహరించారు అంకితం తీసుకున్న వంశీ దంపతులు సాంస్కృతిక సాహిత్య రంగాలకు రెండు కాళ్ళు అని అభివర్ణించారు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం మాట్లాడుతూ...సులభమైన పదాలతో ఎట్టి అతిశయోక్తులు లేకుండా చెప్పే నేర్పు అలివెని సొంతం అన్నారు.ఇంటిపేరు కస్తూరి లోనే సుగంధం నింపుకున్న ఆమె కథలు సువాసన భరితం అన్నారు. సంపుటి ఆవిష్కరణ చేసిన దేవ దాసు నేటి నిజం పత్రికతో చేస్తున్న సాహితీ సేవ అకింతం అందుకున్న వంశీ రామరాజు దంపతుల సాంస్కృతిక సేవ విశేష మని కొనియాడారు రచయిత్రి శైలజ మిత్ర సంపుటి లోని కధలను పరిచయం చేశారు. లేఖిని సంస్థ అధ్యక్షురాలు అత్తలూరి విజయలక్ష్మి స్వాగతం పలుకుతూ సంస్థల కార్యక్రమాలు పరిచయం చేశారు తొలుత ప్రముఖ గాయకుడు వై ఎస్ రామ కృష్ణ బృందం దర్శకుడు విశ్వనాథ్ సినిమాలలోని పాటలు మధురం గా ఆలపించారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









