ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- February 19, 2025
హైదరాబాద్: కథలు నిజ జీవితం ప్రతి బింబాలే నని నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు అన్నారు.శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ లేఖిని రచయిత్రులు వేదిక ఆధ్వర్యంలో కస్తూరి అలివేణి రచించిన ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ,వంశీ రామరాజు డాక్టర్ సుధా రామరాజు కు అంకిత మహోత్సవం సభ జరిగింది.ముఖ్యఅతిథిగా బైస దేవదాసు సంపుటిని ఆవిష్కరించి మాట్లాడుతూ... వాస్తవిక వున్న కథలు కాల పరీక్షకు నిలబడతాయి అని అలువేణి చెప్పిన కధలు సమాజంలో జరిగే సంఘటనలను అద్దంలో చూపాయి అని ఉదహరించారు అంకితం తీసుకున్న వంశీ దంపతులు సాంస్కృతిక సాహిత్య రంగాలకు రెండు కాళ్ళు అని అభివర్ణించారు అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం మాట్లాడుతూ...సులభమైన పదాలతో ఎట్టి అతిశయోక్తులు లేకుండా చెప్పే నేర్పు అలివెని సొంతం అన్నారు.ఇంటిపేరు కస్తూరి లోనే సుగంధం నింపుకున్న ఆమె కథలు సువాసన భరితం అన్నారు. సంపుటి ఆవిష్కరణ చేసిన దేవ దాసు నేటి నిజం పత్రికతో చేస్తున్న సాహితీ సేవ అకింతం అందుకున్న వంశీ రామరాజు దంపతుల సాంస్కృతిక సేవ విశేష మని కొనియాడారు రచయిత్రి శైలజ మిత్ర సంపుటి లోని కధలను పరిచయం చేశారు. లేఖిని సంస్థ అధ్యక్షురాలు అత్తలూరి విజయలక్ష్మి స్వాగతం పలుకుతూ సంస్థల కార్యక్రమాలు పరిచయం చేశారు తొలుత ప్రముఖ గాయకుడు వై ఎస్ రామ కృష్ణ బృందం దర్శకుడు విశ్వనాథ్ సినిమాలలోని పాటలు మధురం గా ఆలపించారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









