బహిరంగ స్థలాలలో ఈద్ ప్రార్థనలు చేయకూడదని కువైట్ ఆదేశం

- July 03, 2016 , by Maagulf
బహిరంగ స్థలాలలో ఈద్ ప్రార్థనలు చేయకూడదని కువైట్ ఆదేశం

       
                          

బహిరంగ స్థలాలలో ఈద్ ప్రార్థనలు ఈ ఏడాది నిషేధిస్తూ కువైట్ ఒక ఆదేశం జారీ చేసింది. భద్రతా అంశాలను పరిగణనలోనికి తీసుకొని ఈ నిర్ణయం తీసుకొన్నారు. దీని ప్రకారం శుక్రవారం ప్రార్ధనలు సాధారణంగా ఎక్కడ  జరుగుతుంటాయో  అక్కడ ఈద్ తెల్లవారుజాము ప్రార్థనలు ఇక్కడ పెద్ద మసీదులకె  పరిమితమై ఉంటుందని దేవాదాయ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది   .  
ప్రయోగాత్మక సంప్రదింపులు, సమన్వయం తర్వాత ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ, , మాన్యాలు మంత్రిత్వ శాఖ మీడియా విభాగం ప్రతినిధి అహ్మద్ అల్ ఖ్అరవి తెలిపారు.
రంజాన్ ఉపవాస మాసం ముగింపు సందర్భంగా జరిపే ప్రార్థనలు ఒక చిన్న స్టేడియంలో నిర్వహిస్తారు తరచుగా జరిగే బహిరంగ ప్రదేశాలలో ఈ ఏడాది రద్దుకు అంతర్గత వ్యవహారాల శాఖ గట్టిగా  సిఫార్సు చేసింది. మంత్రిత్వశాఖ  శనివారం నిర్వహించిన సమావేశంలో తమ నిర్ణయం వక్రీకరిస్తూ కొందరు  ఏ  ఈద్ ప్రార్థనలు లేవని పేర్కొంటున్నారని, తాము అలా అనడం లేదని , ఆ  ప్రార్ధనలు పెద్ద మసీదు లోపల  తదుపరి వారంలో నిర్వహించాలనుకొంటున్నమని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది 
ఈద్ మంగళవారం లేదా బుధవారం జరుగుతుందని భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఒక తాత్కాలిక సమావేశం నిర్వహించి చంద్రుడు కనిపించడంపై  కమిటీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది.  కువైట్ ముస్లింలు సుదీర్ఘ ఉపవాసాన్ని జూన్ 6 న తేదీన ప్రారంభించారు.ఇతర దేశాలలో ముస్లింలతో పోల్చితే వీరి ఉపవాసం పొడవైనది. గత సంవత్సరం జూన్ 26 వ తేదీన సమూహ ప్రార్థన ప్రయోజనాన్ని లబ్ది పొందిన ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు  శుక్రవారం కువైట్ నగరంలో అల్ సాదిక్ మసీదు వద్ద  27 మంది ప్రజలని చంపదానికి అవకాశం  ఏర్పడింది  మరియు  227 గాయాల పాలయ్యారు. ఇటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని పై నిర్ణయం తీసుకొన్నారు.
   
  
        


                     
                      
                

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com