రియాద్ వేదికగా సమావేశమైన GCC, జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు..!!
- February 22, 2025
రియాద్: సౌదీ రాజధానిలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి), జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు సమావేశమయ్యారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ ఆతిథ్యం ఇచ్చిన సమావేశంలో కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్, బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్, ఎఫ్ ఆర్డానియన్ క్రౌన్ ప్రిన్స్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II, యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు, అబుదాబి డిప్యూటీ పాలకుడు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాలస్తీనా సమస్య, గాజాలో అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై నాయకులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. మార్చి 4న కైరోలో జరగనున్న అత్యవసర అరబ్ లీగ్ శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతించారు. తమ మధ్య ఉన్న బలమైన సోదర సంబంధాలను పెంపొందించడం, తమ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఈ సమావేశం కొనసాగుతుందని జీసీసీ, జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







