రియాద్ వేదికగా సమావేశమైన GCC, జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు..!!
- February 22, 2025
రియాద్: సౌదీ రాజధానిలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి), జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు సమావేశమయ్యారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ ఆతిథ్యం ఇచ్చిన సమావేశంలో కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్, బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్, ఎఫ్ ఆర్డానియన్ క్రౌన్ ప్రిన్స్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II, యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు, అబుదాబి డిప్యూటీ పాలకుడు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాలస్తీనా సమస్య, గాజాలో అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై నాయకులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. మార్చి 4న కైరోలో జరగనున్న అత్యవసర అరబ్ లీగ్ శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతించారు. తమ మధ్య ఉన్న బలమైన సోదర సంబంధాలను పెంపొందించడం, తమ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఈ సమావేశం కొనసాగుతుందని జీసీసీ, జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి దుబాయ్ పార్కింగ్ సేవలపై 5% వ్యాట్...పార్కిన్, సాలిక్ కీలక ప్రకటన
- అబూదాబిలో ప్రారంభం కానున్న సోను నిగమ్ వరల్డ్ టూర్
- హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దుబాయ్ ఎయిర్పోర్ట్స్
- గురుదేవ్ నవలను సినిమా చేయాలని నిర్మాత రవి కుమార్ పనసకు సూచన
- రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
- ఇరాన్కు వ్యతిరేకంగా ఉమ్మడి అరబ్ వైఖరి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- 3 రోజుల ఉచిత పార్కింగ్ ప్రకటించిన షార్జా..!!
- షిఫా యాప్ ద్వారా యాత్రికుల కోసం ఐపీఎస్ సేవలు..!!
- స్విమ్మింగ్ పూల్ ప్రమాదాల తగ్గింపునకు గైడ్ లైన్స్ జారీ..!!
- 2.4% మేర పెరిగిన సౌదీ నిర్మాణ కాస్ట్ ఇండెక్స్..!!









