రియాద్ వేదికగా సమావేశమైన GCC, జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు..!!
- February 22, 2025
రియాద్: సౌదీ రాజధానిలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి), జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు సమావేశమయ్యారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ ఆతిథ్యం ఇచ్చిన సమావేశంలో కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్, బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్, ఎఫ్ ఆర్డానియన్ క్రౌన్ ప్రిన్స్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II, యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు, అబుదాబి డిప్యూటీ పాలకుడు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాలస్తీనా సమస్య, గాజాలో అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై నాయకులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. మార్చి 4న కైరోలో జరగనున్న అత్యవసర అరబ్ లీగ్ శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతించారు. తమ మధ్య ఉన్న బలమైన సోదర సంబంధాలను పెంపొందించడం, తమ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఈ సమావేశం కొనసాగుతుందని జీసీసీ, జోర్డాన్, ఈజిప్ట్ నాయకులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







