తెలంగాణ: ఆ ఇద్దరు ఐపిఎస్ లు రిలీవ్...పెండింగ్ లో కరీంనగర్ సీపీ
- February 22, 2025
హైదరాబాద్: తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతీలను రిలీవ్ చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ ముగ్గురు అధికారులను వెంటనే ఆంధ్రాకు రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రత డీజీగా కొనసాగుతున్న అంజనీకుమార్, పోలీస్ ట్రైనింగ్ డిజిగా ఉన్న మరో ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్తాలను తెలంగాణ ప్రభుత్వం నేడు రిలీవ్ చేసింది.. ఈ ఇద్దరు అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎపిలో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించింది.. ఇక ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న అభిషేక్ మహంతిని రిలీవ్ అంశాన్ని పెండింగ్ లో ఉంచింది.. ప్రస్తుతం ఆ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా కోడ్ అమలవుతున్నది.. దీంతో ఆయన రిలీవ్ విషయంలో ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.. అక్కడి నుంచి సమాధానం వచ్చిన తర్వాత అభిషేక్ రిలీవ్ పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









