తెలంగాణ: ఆ ఇద్దరు ఐపిఎస్ లు రిలీవ్...పెండింగ్ లో కరీంనగర్ సీపీ
- February 22, 2025
హైదరాబాద్: తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతీలను రిలీవ్ చేయాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ ముగ్గురు అధికారులను వెంటనే ఆంధ్రాకు రిపోర్టు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రత డీజీగా కొనసాగుతున్న అంజనీకుమార్, పోలీస్ ట్రైనింగ్ డిజిగా ఉన్న మరో ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్తాలను తెలంగాణ ప్రభుత్వం నేడు రిలీవ్ చేసింది.. ఈ ఇద్దరు అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎపిలో రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించింది.. ఇక ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న అభిషేక్ మహంతిని రిలీవ్ అంశాన్ని పెండింగ్ లో ఉంచింది.. ప్రస్తుతం ఆ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా కోడ్ అమలవుతున్నది.. దీంతో ఆయన రిలీవ్ విషయంలో ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.. అక్కడి నుంచి సమాధానం వచ్చిన తర్వాత అభిషేక్ రిలీవ్ పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







