మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో 'ఆంకో న్యూట్రిషన్ ప్రోగ్రామ్' ప్రారంభం
- February 22, 2025
హైదరాబాద్: క్యాన్సర్ చికిత్సలో పౌష్టికాహార ప్రాధాన్యతను గుర్తించి, ప్రతి రోగికి వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పోషకాహార మార్గదర్శకత్వం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సరైన పోషకాహారం – క్యాన్సర్ చికిత్సల ఫలితాలను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్రపోషిస్తుంది. క్యాన్సర్ చికిత్సలు (cancer treatments) కొన్ని నెలల నుండి సంవత్సరాల పాటు కొనసాగుతాయి మరియు చాలా క్యాన్సర్ చికిత్సలు దుష్ప్రభావాలు కలిగిస్తాయి.నోటి పుండ్లు, ఆకలి లేకపోవడం, అలసట, వికారం, వాంతులు, రుచి కోల్పోవడం మొదలైన దుష్ప్రభావాలను కలుగజేస్తాయి. ఇటువంటి దుష్ప్రభావాల వల్ల సరిగా ఆహారం తీసుకోలేక పోవచ్చు లేదా తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించలేక పోవచ్చు. క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి రూపొందించిన శక్తివంతమైన మందులు మరియు చికిత్సా విధానాలను తట్టుకోవడానికి శరీరానికి సరైన పోషకాహారం అవసరం. పేషెంట్స్ తీసుకుంటున్న చికిత్సా విధానానికి, ఎదుర్కొంటున్న దుష్ప్రభావాలకు, మరియు శరీరానికి తగినట్లుగా ప్రత్యేకంగా రూపొందించబడిన ఆహార ప్రణాళిక ద్వారా కావాల్సిన పోషకాహారం పొందవచ్చు. ఇటువంటి పోషకాహారం క్యాన్సర్ చికిత్స సమయంలో బలంగా ఉండడానికి మరియు దుష్ప్రభావాలను నియంత్రించడంలో కూడా మంచి ఆహారం సహాయం చేస్తుంది. సరైన ఆహారం క్యాన్సర్ చికిత్సను కొనసాగించడానికి మరియు మరింత శక్తితో బలంగా ఉండటానికి సహాయపడుతుంది & చికిత్స విజయానికి కీలకం.ఆంకో న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మా డైటీషియన్ మీ క్యాన్సర్ రకం, చికిత్స రకం, మీ ప్రస్తుత శారీరక మరియు వైద్య పరిస్థితి అనుగుణంగా క్యాన్సర్ చికిత్సలను తట్టుకొని, త్వరగా కోలుకోవడానికి శరీరానికి ఉపయోగపడేలా రూపొందించబడతాయి. మీ రోజువారీ పోషకాహార అవసరాల ఆధారంగా, తయారీ విధానాలతో పాటు మీకు భోజన ప్రణాళిక (Diet Plan) అందించబడుతుంది. తగిన పోషకాహారం తీసుకోవడం వలన శస్త్రచికిత్స మరియు కీమోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్సల తర్వాత బరువు తగ్గకుండా ఉండేందుకు మరియు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది
కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అమిత్ జోత్వాని ఈ కార్యక్రమంపై మాట్లాడుతూ, “క్యాన్సర్ చికిత్స కేవలం వ్యాధిని నయం చేయడం మాత్రమే కాదు; రోగులు త్వరగా కోలుకోవడం, వారి శక్తిని తిరిగి పొందడం ఎంతో ముఖ్యం. పోషకాహారం ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఆంకో న్యూట్రిషన్ ప్రోగ్రామ్’ ద్వారా మేము రోగుల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉన్నాము.” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో డాక్టర్ ప్రశాంత్ రెడ్డి (కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్), డాక్టర్ సరిత శ్రీవాస్తవ (మెడికల్ & హీమటో ఆంకాలజిస్ట్), డాక్టర్ ప్రవీణ్,డాక్టర్ శ్రీరామ్,డాక్టర్ రఘుకాంత్ (పల్మనాలజిస్ట్),డాక్టర్ శ్రీలత (న్యూట్రిషనిస్టు & డైటీషియన్) మరియు సెంటర్ హెడ్ సువంకర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









