కొత్త మల్టీ ఎంట్రీ వీసా పథకాన్ని ప్రకటించిన దుబాయ్..!!
- February 23, 2025
దుబాయ్: యాచ్ సిబ్బంది ఇప్పుడు దుబాయ్కి మల్టీ ఎంట్రీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ప్రకటించింది. కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసా ఆరు నెలల అమల్లో ఉంటుందని దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2025 సందర్భంగా GDRFA తెలిపింది. ఫిబ్రవరి 19న దుబాయ్ హార్బర్లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 వరకు కొనసాగుతుంది. ఈ వార్షిక ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన బోట్ షోలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా GDRFA ప్రత్యేకంగా యాచింగ్ రంగం, సముద్ర కమ్యూనిటీ కోసం ప్రత్యేకమైన సేవలను ప్రదర్శిస్తోంది. వీటిలో మొబైల్ మెరీనా, వర్క్ బండిల్, ప్లాట్ఫారమ్ 04, దుబాయ్ రెసిడెన్సీ కమ్యూనిటీ నెట్వర్క్ ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో సూపర్యాచ్ల యజమానులకు గోల్డెన్ వీసాను అబుదాబి ప్రకటించింది.
తాజా వార్తలు
- సలాలాకు ఎతిహాద్ ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
- APSFTVTDCకు కొత్త పాలకవర్గం నియామకం
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ









