కొత్త మల్టీ ఎంట్రీ వీసా పథకాన్ని ప్రకటించిన దుబాయ్..!!
- February 23, 2025
దుబాయ్: యాచ్ సిబ్బంది ఇప్పుడు దుబాయ్కి మల్టీ ఎంట్రీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ప్రకటించింది. కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసా ఆరు నెలల అమల్లో ఉంటుందని దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2025 సందర్భంగా GDRFA తెలిపింది. ఫిబ్రవరి 19న దుబాయ్ హార్బర్లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 వరకు కొనసాగుతుంది. ఈ వార్షిక ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన బోట్ షోలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా GDRFA ప్రత్యేకంగా యాచింగ్ రంగం, సముద్ర కమ్యూనిటీ కోసం ప్రత్యేకమైన సేవలను ప్రదర్శిస్తోంది. వీటిలో మొబైల్ మెరీనా, వర్క్ బండిల్, ప్లాట్ఫారమ్ 04, దుబాయ్ రెసిడెన్సీ కమ్యూనిటీ నెట్వర్క్ ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో సూపర్యాచ్ల యజమానులకు గోల్డెన్ వీసాను అబుదాబి ప్రకటించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







