కొత్త మల్టీ ఎంట్రీ వీసా పథకాన్ని ప్రకటించిన దుబాయ్..!!

- February 23, 2025 , by Maagulf
కొత్త మల్టీ ఎంట్రీ వీసా పథకాన్ని ప్రకటించిన దుబాయ్..!!

దుబాయ్: యాచ్ సిబ్బంది ఇప్పుడు దుబాయ్‌కి మల్టీ ఎంట్రీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ప్రకటించింది. కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసా ఆరు నెలల అమల్లో ఉంటుందని దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2025 సందర్భంగా GDRFA తెలిపింది. ఫిబ్రవరి 19న దుబాయ్ హార్బర్‌లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 వరకు కొనసాగుతుంది. ఈ వార్షిక ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన బోట్ షోలలో ఒకటిగా గుర్తింపు పొందింది.  ఈ సందర్భంగా GDRFA ప్రత్యేకంగా యాచింగ్ రంగం, సముద్ర కమ్యూనిటీ కోసం ప్రత్యేకమైన సేవలను ప్రదర్శిస్తోంది. వీటిలో మొబైల్ మెరీనా, వర్క్ బండిల్, ప్లాట్‌ఫారమ్ 04, దుబాయ్ రెసిడెన్సీ కమ్యూనిటీ నెట్‌వర్క్ ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో సూపర్‌యాచ్‌ల యజమానులకు గోల్డెన్ వీసాను అబుదాబి ప్రకటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com