టన్నెల్లో చిక్కుకున్న సిబ్బందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు
- February 24, 2025
హైదరాబాద్: హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే సొరంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ మందగించింది. 11 కిలోమీటర్లు దాటి లోపలికి వెళ్లడం గగనంగా మారింది.కన్వేయర్ బెల్టు సహాయంతోనే వెళ్లే పరిస్థితి ఉండడం..ఆక్సిజన్ పంపించే ట్యూబ్ కూడా ధ్వంసమవడం, నీరు.. బురద.. బోరింగ్ మిషన్కు సంబంధించిన మెటీరియల్ మొత్తం కుప్పకూలడంతో వాటిని బయటికి తీసుకురావాలని.. ఆ తర్వాతే లోపలికి వెళ్లగలిగే అవకాశం ఉంటుందని ఒక నిర్ధారణకు వచ్చారు.
ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఈ విషయాలను వెల్లడించారు.లోపల ప్రమాదం జరిగిన తీరును.. ఏ విధంగా రెస్క్యూ చేయాలో ఓ బ్లూ ప్రింట్ను(మ్యాప్) తయారు చేశారు.దానిని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించే బృందాలకు ఇచ్చారు.లోపలికి వెళ్లేందుకు దీన్ని వినియోగించుకుంటారు. మరోవైపు ముందుగా సొరంగంలోపల విద్యుత్ పునరుద్ధరించడం కోసం తగిన సామాగ్రిని పంపిస్తున్నారు.అలాగే ఆక్సిజన్ అందించే వీ ట్యూట్ను పునరుద్ధరించే చర్యలు కూడా చేపట్టి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన తీరుపై రెస్క్యూ బృందాలు ఒక నిర్ధారణకు వచ్చాయి.టీబీఎన్ మిషన్ సమీపంలో 40 మీటర్ల వెడల్పులో కుప్పకూలిన పైకప్పు దగ్గర 8 మంది చిక్కుకొని ఉంటారని నిర్ధారణకు వచ్చారు. అక్కడికి ఎలా వెళ్లాలి, అక్కడున్న ప్రతికూల పరిస్థితులపై పూర్తి నిర్ధారణకు వచ్చారు.కార్మికులు చిక్కుకున్న ప్రదేశానికి వెళ్లాలంటే సుమారు 100 మీటర్లు అడ్డంకిగా మారింది.దీన్ని పూర్తిగా తొలగిస్తేనే అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది.ఇవన్నీ జరగాలంటే కనీసం 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









