రాజకీయ ధృవతార-మందాడి అనిల్ కుమార్ యాదవ్: స్పెషల్ స్టోరీ
- February 24, 2025
మందాడి అనిల్ కుమార్ యాదవ్...తెలంగాణ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక రాష్ట్ర నేతల్లో ఒకరు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించినప్పటికి తన స్వశక్తితో అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ అత్యున్నత సభగా పిలుచుకునే రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో బహుజన వర్గాల ప్రతినిధిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
మందాడి అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ నగరంలోని పురానపూల్ ప్రాంతంలో అంజన్ కుమార్ యాదవ్, నాగమణి దంపతులకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తిచేశారు. తండ్రి అంజన్ కుమార్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ నగర కాంగ్రెస్ సీనియర్ నేత మరియు సికింద్రాబాద్ నుంచి రెండు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.
తండ్రిని చూస్తూ పెరిగిన చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను కలిగి ఉండేవారు. తండ్రి అంజన్ కుమార్ అడుగుజాడల్లో నడుస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే కాంగ్రెస్ విద్యార్ధి విభాగం ఎన్.ఎస్.యూలో చేరి యూనివర్సిటీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత తెలంగాణ మొదటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జాతీయ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
యూత్ కాంగ్రెస్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పలు ప్రజా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. 2018,2023లలో ముషీరాబాద్ నుంచి పోటీ స్వల్ప తేడాతో ఓటమి పాలైయ్యారు. అయితే, పార్టీ బలోపేతం కోసం అనిల్ చేసిన కృషిని గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం 2023లో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ అనిల్ పేరును 2024లో కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎంపీగా పంపించింది. ఎంపీగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని యూత్ అనిల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. అనిల్ లాంటి బహుజన వర్గానికి చెందిన యువనేత రాజకీయాల్లో తన స్వశక్తితో రాజకీయాల్లో ఎదుగుతూ ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంతో అనిల్ కృషి చేస్తున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







