రమదాన్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిస్టెన్స్ లెర్నింగ్..!!

- February 27, 2025 , by Maagulf
రమదాన్.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిస్టెన్స్ లెర్నింగ్..!!

యూఏఈ: రమదాన్ మాసంలో ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిస్టెన్స్ లెర్నింగ్ కోసం కేటాయించారు. అయితే, పవిత్ర మాసంలో శుక్రవారం పరీక్షల షెడ్యూల్‌లు ఆమోదించని విద్యార్థులకు ఇది వర్తించదని యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం మంత్రిత్వ శాఖ "కుటుంబంతో రమదాన్" కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. అంతకుముందు, రమదాన్ కోసం ప్రభుత్వ రంగ ఉద్యోగుల అధికారిక పని గంటలను కుదించారు. సోమవారం నుండి గురువారం వరకు పని వేళలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2.30 వరకు, శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. వేర్వేరు గంటలు పని చేసే ఉద్యోగులకు మినహాయింపులు వర్తిస్తాయని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (ఫహర్) ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com