రియాద్ లో అర్ధరాత్రి 2వరకు మెట్రో.. అర్ధరాత్రి 3వరకు బస్ సర్వీసులు..!!
- February 28, 2025
రియాద్: రియాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పవిత్ర రమదాన్ మాసంలో రియాద్ మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల రోజువారీ ఆపరేటింగ్ వేళలను ప్రకటించింది. రియాద్ మెట్రో శుక్రవారం మినహా అన్ని రోజులలో అర్ధరాత్రి 2:00 గంటల వరకు నడుస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు తెల్లవారుజామున 3:00 గంటల వరకు పనిచేస్తాయి. రియాద్ మెట్రో శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల తర్వాత మాత్రమే పనిచేస్తాయి. ఈ సేవ తెల్లవారుజామున 3:00 గంటల వరకు కొనసాగుతుంది. రమదాన్ సందర్భంగా రైలు, బస్సు సర్వీసుల సవరించిన షెడ్యూల్ ఇలా ఉంది.
రియాద్ మెట్రో
ఆదివారం నుండి గురువారం వరకు: 8:00 AM నుండి 2:00 AM వరకు
శుక్రవారం: 12:00 PM నుండి 3:00 AM వరకు
శనివారం: 10:00 AM నుండి 2:00 AM వరకు
ప్రజా రవాణా బస్సులు
రోజూ 6:30 AM నుండి 3:00 AM వరకు
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









