SLBC టన్నెల్ ప్రమాదం–ఎనిమిది మంది మృతి
- February 28, 2025
తెలంగాణ: SLBC టన్నెల్ ప్రమాదం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద చోటుచేసుకున్న ఎస్ఎల్బీసీ (సుగర్ లిఫ్ట్ బ్యాంక్ క్యానాల్) టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు మృతిచెందారు.రెస్క్యూ టీమ్ అధునాతన పరికరాలు, రాడార్ల సహాయంతో మృతదేహాలను గుర్తించింది.ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు ప్రాణాలు కోల్పోయారు.మృతదేహాలను బయటకు తీసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని రెస్క్యూ అధికారులు తెలిపారు. గత ఏడు రోజులుగా నిరంతరాయంగా సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ, బాధితులను ప్రాణాలతో రక్షించలేకపోవడం విషాదాన్ని నింపింది.
ప్రభుత్వ నిర్లక్ష్యం పై విమర్శలు
ఈ ప్రమాదంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే తగిన చర్యలు తీసుకుని ఉంటే, కార్మికులను ప్రాణాలతో కాపాడే అవకాశం ఉండేదని పలువురు నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉండటమే కాకుండా, సహాయక చర్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మంత్రులు పొద్దున్నే వస్తే, సాయంత్రానికి వెళ్లిపోతున్నారని, బాధిత కుటుంబాలకు అండగా ఉండే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆయన మండిపడ్డారు.
GPS, రేడియో తరంగాలతో మృతదేహాల గుర్తింపు
మృతదేహాలను గుర్తించేందుకు జిపిఎస్ మరియు రేడియో తరంగాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో సొరంగం చివరి భాగాన్ని స్కాన్ చేశారు. ఈ ప్రక్రియలో ఐదు ముఖ్యమైన స్పాట్లను గుర్తించారు.రేడియో తరంగాల ద్వారా కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని ఖచ్చితంగా నిర్ధారించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. టన్నెల్ లోపల పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో, సహాయ చర్యల్లో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు అంగీకరించారు.
సమీకృత సహాయ చర్యలు–అధికారిక ప్రకటన
ప్రస్తుతం సొరంగం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ నేతృత్వంలో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.సహాయక చర్యల తాజా పరిస్థితి పై ఈ రోజు రాత్రికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.మృతదేహాలను తీయడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, స్కానింగ్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో మాత్రమే తవ్వకాలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రతిహతమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
తాజా వార్తలు
- ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..
- తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ







