ఫైనల్: భారత్ సెమీస్ గెలిచిన 40 నిమిషాల్లోనే టిక్కెట్లు సేల్..!!
- March 05, 2025
దుబాయ్: దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా పై భారత్ గెలుపొందిన తర్వాత అధికారిక వెబ్సైట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ టిక్కెట్లన్నీ 40 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే అమ్ముడయ్యాయి. రాత్రి 10 గంటలకు (యూఏఈసమయం) టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దిర్హామ్లు 250 జనరల్ అడ్మిషన్ నుండి దిర్హామ్లు 12,000 స్కై బాక్స్ వరకు అన్నీ రాత్రి 10.40 గంటలకల్లా అయిపోయాయి. ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నిలకడగా 84 పరుగులు సాధించడంతో - ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మెన్ ఇన్ బ్లూ మరో ఉత్తేజకరమైన ఆటను చూడటానికి భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 9న దుబాయ్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండవ సెమీఫైనల్ విజేతతో భారత్ తలపడుతుంది. రెండవ సెమీఫైనల్ బుధవారం లాహోర్లో జరుగుతుంది. రాత్రి 10 గంటలకు టికెట్ల పేజీని యాక్సెస్ చేయడానికి 100,000 మందికి పైగా ప్రజలు క్యూలో వేచి ఉన్నారు.
డిసెంబర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారతదేశంలో జరిగే మ్యాచ్లను నిర్వహించడానికి దుబాయ్ను తటస్థ వేదికగా నిర్ధారించింది. ఇక్కడ జరిగే చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!







