ఫైనల్: భారత్ సెమీస్ గెలిచిన 40 నిమిషాల్లోనే టిక్కెట్లు సేల్..!!
- March 05, 2025
దుబాయ్: దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా పై భారత్ గెలుపొందిన తర్వాత అధికారిక వెబ్సైట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ టిక్కెట్లన్నీ 40 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే అమ్ముడయ్యాయి. రాత్రి 10 గంటలకు (యూఏఈసమయం) టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దిర్హామ్లు 250 జనరల్ అడ్మిషన్ నుండి దిర్హామ్లు 12,000 స్కై బాక్స్ వరకు అన్నీ రాత్రి 10.40 గంటలకల్లా అయిపోయాయి. ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నిలకడగా 84 పరుగులు సాధించడంతో - ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మెన్ ఇన్ బ్లూ మరో ఉత్తేజకరమైన ఆటను చూడటానికి భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 9న దుబాయ్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండవ సెమీఫైనల్ విజేతతో భారత్ తలపడుతుంది. రెండవ సెమీఫైనల్ బుధవారం లాహోర్లో జరుగుతుంది. రాత్రి 10 గంటలకు టికెట్ల పేజీని యాక్సెస్ చేయడానికి 100,000 మందికి పైగా ప్రజలు క్యూలో వేచి ఉన్నారు.
డిసెంబర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారతదేశంలో జరిగే మ్యాచ్లను నిర్వహించడానికి దుబాయ్ను తటస్థ వేదికగా నిర్ధారించింది. ఇక్కడ జరిగే చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









