15 కేజీల బంగారం స్మగ్లింగ్...సినీ నటి అరెస్టు
- March 05, 2025
బెంగళూరు: కన్నడ నటి రాన్యా రావ్ అరెస్ట్ అయ్యారు. బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చారనే కారణంతో డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ఆమె తీసుకొచ్చిన దాదాపు 15 కేజీల బంగారాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాన్యా ఇటీవల తరుచుగా దుబాయ్ వెళ్లి వస్తుండటంతో ఆమెపై నిఘా పెట్టారు అధికారులు. 15 రోజుల వ్యవధిలో 4 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిన రాన్యా గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొచ్చినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రాన్యా రావ్ ని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. నటి రాన్యా సోమవారం రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ లో బెంగళూరు వచ్చారు. రాన్యా ఇటీవలి కాలంలో తరుచుగా ఫారిన్ ట్రిప్స్ కు వెళ్తున్నారు. దీంతో డీఆర్ఐ అధికారులకు ఆమెపై అనుమానం వచ్చింది. వెంటనే ఆమెపై నిఘా పెట్టారు.
దుబాయ్ నుంచి వచ్చిన రాన్యాను అధికారులు కెంపె గౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఆమెని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అంతే, వారికి షాక్ తగిలినంత పనైంది. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. బంగారాన్ని చాలావరకు కనిపించకుండా ధరించగలిగిందని, అదే సమయంలో తన దుస్తుల్లో బంగారు కడ్డీలను రాన్యా రావ్ దాచిపెట్టిందని అధికారులు తెలిపారు.
రాన్యా రావ్ కర్నాటకకు చెందిన డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి కూతురు. గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాఫ్తు చేపట్టారు. రాన్యా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, గోల్డ్ స్మగ్లింగ్ వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణంలో విచారిస్తున్నారు.
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సరసన మాణిక్య మూవీలో రాన్యా నటించింది. పలు సౌత్ ఇండియన్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. రాన్యాను అదుపులోకి తీసుకున్న అధికారులు.. మరింత లోతుగా దర్యాఫ్తు చేసేందుకు ఆమెను బెంగళూరులోని డీఆర్ఐ హెడ్ క్వార్టర్స్ కి తరలించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









