ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్స్ లో భారత్ తో తలపడనున్న న్యూజిలాండ్
- March 05, 2025
పాకిస్తాన్: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోకి న్యూజిలాండ్ దూసుకెళ్లింది. తుది పోరులో భారత్ తో తలపడనుంది. లాహోర్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. 50 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ విజయంతో ఫైనల్ కి చేరింది కివీస్.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్ సన్ సెంచరీలతో చెలరేగారు. రచిన్ 101 బంతుల్లో 108 పరుగులు చేయగా, విలియమ్ సన్ 94 బంతుల్లోనే 102 రన్స్ చేశాడు. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ చెరో 49 పరుగులతో విజృభించారు.
363 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 50 ఓవర్లలో 312 పరుగులే చేసింది. ఆ జట్టులో డేవిడ్ మిల్లర్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. మిల్లర్ 67 బంతుల్లో 100 రన్స్ చేశాడు. చివరి వరకు క్రీజులో ఉన్నాడు. వాన్ డర్ సన్ (69), కెప్టెన్ బవుమా (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరల్లో మిల్లర్ మెరుపులు మెరిపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కానీ, భారీ టార్గెట్ ను ఛేజ్ చేయలేకపోయాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







