ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్స్ లో భారత్ తో తలపడనున్న న్యూజిలాండ్
- March 05, 2025
పాకిస్తాన్: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోకి న్యూజిలాండ్ దూసుకెళ్లింది. తుది పోరులో భారత్ తో తలపడనుంది. లాహోర్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్ లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. 50 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ విజయంతో ఫైనల్ కి చేరింది కివీస్.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్ సన్ సెంచరీలతో చెలరేగారు. రచిన్ 101 బంతుల్లో 108 పరుగులు చేయగా, విలియమ్ సన్ 94 బంతుల్లోనే 102 రన్స్ చేశాడు. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ చెరో 49 పరుగులతో విజృభించారు.
363 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 50 ఓవర్లలో 312 పరుగులే చేసింది. ఆ జట్టులో డేవిడ్ మిల్లర్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. మిల్లర్ 67 బంతుల్లో 100 రన్స్ చేశాడు. చివరి వరకు క్రీజులో ఉన్నాడు. వాన్ డర్ సన్ (69), కెప్టెన్ బవుమా (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివరల్లో మిల్లర్ మెరుపులు మెరిపించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. కానీ, భారీ టార్గెట్ ను ఛేజ్ చేయలేకపోయాడు.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







