భిక్షాటన చేస్తున్న 11 మంది ప్రవాసుల అరెస్టు.. స్పాన్సర్ బహిష్కరణ..!!
- March 06, 2025
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మసీదులు, మార్కెట్ల ముందు భిక్షాటన చేస్తున్న 11 మందిని అరెస్టు చేసింది. వీరిలో 8 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. అరెస్టయిన వారిలో కొందరు విజిట్ వీసాలు లేదా ఫ్యామిలీ రెసిడెన్సీ పర్మిట్లతో దేశంలోకి ప్రవేశించగా, మరికొందరు శాశ్వత ఉద్యోగాలు లేకుండా మార్జినల్ లేబర్లుగా ప్రవేశించారు. చట్టాన్ని ఉల్లంఘించే విధంగా వారి నియామకాలను సులభతరం చేసిన కంపెనీలపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఆర్టికల్ (22) కింద అరెస్టు చేయబడిన వారిని వారి స్పాన్సర్తో పాటు దేశం నుండి బహిష్కరిస్తామని,ఆర్టికల్ (18) కింద అరెస్టు చేయబడిన వారి కంపెనీ ఫైల్ మూసివేయబడుతుంది అని వర్గాలు తెలిపాయి. ఆర్టికల్ (20) లో ఉన్న గృహ కార్మికులను బహిష్కరిస్తారు. భిక్షాటనలో దోపిడీ చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొన్ని సోషల్ మీడియా నెట్వర్క్ల ద్వారా ఎలక్ట్రానిక్ భిక్షాటనకు సంబంధించిన ఏవైనా కేసులను సైబర్ నేరాల పోరాట విభాగంతో సమన్వయం, సహకారంతో పర్యవేక్షించి, సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. భిక్షాటనకు సంబంధించిన ఏవైనా కేసులను వెంటనే ఈ క్రింది నంబర్లకు తెలియజేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతి ఒక్కరికీ పిలుపునిచ్చింది: 97288211 - 97288200 - 25582581 లేదా అత్యవసర ఫోన్ నంబర్ 112 కు సమాచారం ఇవ్వాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









