నాలుగు ఏళ్లలో సౌదీ అరేబియాకు 2.5 మిలియన్ల క్రీడా పర్యాటకులు..!!
- March 06, 2025
రియాద్: సౌదీ అరేబియా గత నాలుగు సంవత్సరాలలో 2.5 మిలియన్ల క్రీడా పర్యాటకులను స్వాగతించింది. విజన్ 2030లో భాగంగా 80 అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను నిర్వహించిందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు. ప్రపంచ క్రీడా పర్యాటక పరిశ్రమలో పెరుగుతున్న సౌదీ పాత్రను హైలైట్ చేశారు. ఇది ఇప్పుడు ప్రపంచ పర్యాటక వ్యయంలో 10% వాటా కలిగి ఉంది. 2030 నాటికి 17.5% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా ప్రపంచ క్రీడా పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషించిందని,ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మరియు అథ్లెట్లను ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. జెడ్డాలో జరిగిన ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ వంటి కార్యక్రమాలు 160 దేశాల నుండి సందర్శకులను ఆకర్షించింది. ఇవి 20,000 ఉద్యోగ అవకాశాలను సృష్టించాయి. ఆర్థిక వ్యవస్థకు SR900 మిలియన్లను అందించాయి. WWE సూపర్ షోడౌన్, సౌదీ ప్రో గోల్ఫ్ ఛాంపియన్షిప్, బ్యాటిల్ ఆఫ్ ది ఛాంపియన్స్, ఫార్ములా E, ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ సూపర్ గ్లోబ్, సౌదీ ఇంటర్నేషనల్ మీటింగ్ ఫర్ డిజేబిలిటీస్ స్పోర్ట్ వంటి విభిన్న శ్రేణి ప్రధాన క్రీడా పోటీలను కూడా సౌదీ అరేబియా నిర్వహించి విజయవంతం చేసింది. 2030 నాటికి సౌదీ అరేబియా ఏటా 150 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులను స్వాగతించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







