షార్జా కార్మికుల కోసం ఇఫ్తార్, క్రికెట్ మ్యాచ్
- July 04, 2016
స్కైలైన్ యూనివర్సిటీ కాలేజ్ (ఎస్యుసి), షార్జా లేబర్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ అథారిటీ (ఎల్ఎస్డి) సంయుక్తంగా ఇఫ్తార్ డిన్నర్ మరియు క్రికెట్ మ్యాచ్ని 250 మంది కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ఎన్నో కష్టాలను అనుభవించే కార్మికుల్ని కాస్సేపు ఆనందంలో ముంచెత్తడం కోసం, అలాగే ఇఫ్తార్ డిన్నర్ ద్వారా వారిలో సంతోషాన్ని నింపేందుకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాల పట్ల, సుహృద్భావ వాతావరణం పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి యేడాదీ క్రికెట్ నిర్వహించడం ద్వారా ఎప్పుడూ క్రికెట్ ఆడేందుకు అవకాశం లేనివారు, ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, తమకూ గుర్తింపు దక్కుతుందన్న ఆనందం వ్యక్తం చేస్తారనీ, కార్మికుల్లో ఈ ఉత్సాహం నింపడానికే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కమ్యూనిటీ సర్వీసెస్ కమిటీ - ఎస్యుసి లెక్చరర్ మరియు చైర్ పర్సన్ మొహమ్మద్ అబ్దు సలాం చెప్పారు. విద్యార్థులు పెద్దవారిని గౌరవించడంలో భాగంగా వృద్ధులు ఉండే ఇంటికి వెళ్ళి, వారి యోగ క్షేమాల్ని అడిగి తెలుసుకోవడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. కార్మికులు, క్రికెట్ మ్యాచ్ని ఆడి, తిలకించి అమితానందాన్ని పొందారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







