షార్జా కార్మికుల కోసం ఇఫ్తార్, క్రికెట్ మ్యాచ్
- July 04, 2016
స్కైలైన్ యూనివర్సిటీ కాలేజ్ (ఎస్యుసి), షార్జా లేబర్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ అథారిటీ (ఎల్ఎస్డి) సంయుక్తంగా ఇఫ్తార్ డిన్నర్ మరియు క్రికెట్ మ్యాచ్ని 250 మంది కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ఎన్నో కష్టాలను అనుభవించే కార్మికుల్ని కాస్సేపు ఆనందంలో ముంచెత్తడం కోసం, అలాగే ఇఫ్తార్ డిన్నర్ ద్వారా వారిలో సంతోషాన్ని నింపేందుకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి కార్యక్రమాల పట్ల, సుహృద్భావ వాతావరణం పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి యేడాదీ క్రికెట్ నిర్వహించడం ద్వారా ఎప్పుడూ క్రికెట్ ఆడేందుకు అవకాశం లేనివారు, ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా, తమకూ గుర్తింపు దక్కుతుందన్న ఆనందం వ్యక్తం చేస్తారనీ, కార్మికుల్లో ఈ ఉత్సాహం నింపడానికే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కమ్యూనిటీ సర్వీసెస్ కమిటీ - ఎస్యుసి లెక్చరర్ మరియు చైర్ పర్సన్ మొహమ్మద్ అబ్దు సలాం చెప్పారు. విద్యార్థులు పెద్దవారిని గౌరవించడంలో భాగంగా వృద్ధులు ఉండే ఇంటికి వెళ్ళి, వారి యోగ క్షేమాల్ని అడిగి తెలుసుకోవడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. కార్మికులు, క్రికెట్ మ్యాచ్ని ఆడి, తిలకించి అమితానందాన్ని పొందారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









