మోదీ ని కలిసిన ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లు

- July 04, 2016 , by Maagulf
మోదీ ని కలిసిన ఒలింపిక్స్‌కు వెళ్లే అథ్లెట్లు

రియో ఒలింపిక్స్‌లో భారత్‌ తరపు పాల్గొనే క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు కలుసుకున్నారు. దిల్లీ మానెక్‌షా కేంద్రంలోని ఒలింపిక్‌ విభాగంలో క్రీడాకారులతో మోదీ మాట్లాడారు. ఒలింపిక్స్‌లో 13 విభాగాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన 100 మంది అథ్లెట్లకు ప్రధాని అభినందనలు తెలిపారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో ఒలింపిక్స్‌ జరగనున్నాయి. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మనదేశంలో తరపున 83 మంది క్రీడాకారులు పాల్గొనగా... ఈసారి ఆ సంఖ్య వంద దాటింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com