సౌదీలో చట్టపరమైన విధానాలను ఎదుర్కొంటున్న 40వేల మంది ప్రవాసులు..!!
- March 09, 2025
రియాద్: రెసిడెన్సీ, కార్మిక, సరిహద్దు భద్రతా చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 27, మార్చి 5 మధ్య దేశవ్యాప్తంగా తనిఖీ ప్రచారాలను నిర్వహించింది. ఫలితంగా 20,749 ఉల్లంఘనలు నమోదయ్యాయి. రెసిడెన్సీకి సంబంధించిన 13,871 ఉల్లంఘనలు, సరిహద్దు భద్రతకు సంబంధించిన 3,517, కార్మిక నిబంధనలకు సంబంధించిన 3,361 ఉల్లంఘనలను అధికారులు నివేదించారు.
మొత్తం 1,051 మంది వ్యక్తులు రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. వీరిలో 43% మంది యెమెన్లు, 54% మంది ఇథియోపియన్లు, 3% మంది ఇతర దేశాల నుండి వచ్చారు. వీరితోపాటు చట్టవిరుద్ధంగా దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నించిన 90 మందిని అరెస్టు చేశారు. చట్టాల ఉల్లంఘించినవారికి ఆశ్రయం కల్పించినందుకు భద్రతా దళాలు 12 మంది వ్యక్తులను అరెస్టు చేశాయి.
ప్రస్తుతం, 40,173 మంది ప్రవాసులు చట్టపరమైన విధానాలను అనుసరిస్తున్నారు. 32,375 మంది సరైన ప్రయాణ పత్రాలను పొందడానికి వారి సంబంధిత రాయబార కార్యాలయాలు లేదా కాన్సులేట్లను సంప్రదించాలని సూచించగా.. 2,576 మందిని నిష్క్రమణ బుకింగ్లను ఏర్పాటుకు, 10,024 మంది వ్యక్తులను కూడా స్వదేశానికి తిప్పి పంపించారు. చట్టాలను ఉల్లంఘించన వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానాలు విధించడంతోపాటు సంబంధిత వాహనాలు లేదా ఆస్తులను జప్తు చేయవచ్చని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లలో 911 కు .. రాజ్యంలోని ఇతర ప్రాంతాలలో 999 లేదా 996 కు కాల్ చేయడం ద్వారా ఏవైనా ఉల్లంఘనలను నివేదించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







