సౌదీలో చట్టపరమైన విధానాలను ఎదుర్కొంటున్న 40వేల మంది ప్రవాసులు..!!
- March 09, 2025
రియాద్: రెసిడెన్సీ, కార్మిక, సరిహద్దు భద్రతా చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 27, మార్చి 5 మధ్య దేశవ్యాప్తంగా తనిఖీ ప్రచారాలను నిర్వహించింది. ఫలితంగా 20,749 ఉల్లంఘనలు నమోదయ్యాయి. రెసిడెన్సీకి సంబంధించిన 13,871 ఉల్లంఘనలు, సరిహద్దు భద్రతకు సంబంధించిన 3,517, కార్మిక నిబంధనలకు సంబంధించిన 3,361 ఉల్లంఘనలను అధికారులు నివేదించారు.
మొత్తం 1,051 మంది వ్యక్తులు రాజ్యంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. వీరిలో 43% మంది యెమెన్లు, 54% మంది ఇథియోపియన్లు, 3% మంది ఇతర దేశాల నుండి వచ్చారు. వీరితోపాటు చట్టవిరుద్ధంగా దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నించిన 90 మందిని అరెస్టు చేశారు. చట్టాల ఉల్లంఘించినవారికి ఆశ్రయం కల్పించినందుకు భద్రతా దళాలు 12 మంది వ్యక్తులను అరెస్టు చేశాయి.
ప్రస్తుతం, 40,173 మంది ప్రవాసులు చట్టపరమైన విధానాలను అనుసరిస్తున్నారు. 32,375 మంది సరైన ప్రయాణ పత్రాలను పొందడానికి వారి సంబంధిత రాయబార కార్యాలయాలు లేదా కాన్సులేట్లను సంప్రదించాలని సూచించగా.. 2,576 మందిని నిష్క్రమణ బుకింగ్లను ఏర్పాటుకు, 10,024 మంది వ్యక్తులను కూడా స్వదేశానికి తిప్పి పంపించారు. చట్టాలను ఉల్లంఘించన వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానాలు విధించడంతోపాటు సంబంధిత వాహనాలు లేదా ఆస్తులను జప్తు చేయవచ్చని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లలో 911 కు .. రాజ్యంలోని ఇతర ప్రాంతాలలో 999 లేదా 996 కు కాల్ చేయడం ద్వారా ఏవైనా ఉల్లంఘనలను నివేదించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









