యూఏఈ కేంద్రగా పనిచేసే యూకే కంపెనీ మోసం పై విచారణ..!!
- March 10, 2025
యూఏఈ: యూఏఈలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న UKకి చెందిన అసెట్ మేనేజ్మెంట్ సంస్థపై ఓ ఫ్రాడ్ కేసు దర్యాప్తులో భాగంగా UKలోని దాని ప్రధాన కార్యాలయంపై దాడులు జరిగాయి. 2022లో యూఏఈ మార్కెట్లోకి ప్రవేశించిన సెవెన్టీ నైన్త్ గ్రూప్.. పెట్టుబడిదారులకు వారి రుణాలపై అధిక రాబడిని ఆఫర్ చేసిన ఫ్రాడ్ కేసుపై లండన్ నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్లోని మెట్రోపాలిటన్ కౌంటీ అయిన మెర్సీసైడ్లోని ఐదు వేర్వేరు కంపెనీ బ్రాంచీలపై దాడుల జరిగాయి. ఆయా కార్యాలయాల నుంచి పెద్ద మొత్తంలో నగదు, లగ్జరీ గడియారాలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు.
కంపెనీ అసెట్స్ పై లోన్ నోట్లను విక్రయించడం ద్వారా పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని, £10,000 నుండి ప్రారంభమయ్యే రుణాలపై 12 - 15 శాతం మధ్య రాబడిని హామీ ఇస్తుందని ఫోర్స్ పేర్కొంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సెవెన్టీ నైన్త్ గ్రూప్ కెనడా, గినియాలో రియల్ ఎస్టేట్, అసెట్స్ నిర్వహణతోపాటు మైనింగ్ రంగంలో కూడా పనిచేస్తుంది. మరోవైపు తమ సంస్థలో ఎటువంటి తప్పులు జరగలేదని ఆరోపణలను కంపెనీ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, ఈ కేసుపై యూఏఈలోని వ్యాపార వర్గాలలో చర్చకు దారితీసింది. కంపెనీ ఆర్థిక లావాదేవీలలో పెట్టుబడిదారుల రక్షణ, నియంత్రణ పర్యవేక్షణపై ఆందోళనలను లేవనెత్తింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా