యూఏఈ కేంద్రగా పనిచేసే యూకే కంపెనీ మోసం పై విచారణ..!!
- March 10, 2025
యూఏఈ: యూఏఈలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న UKకి చెందిన అసెట్ మేనేజ్మెంట్ సంస్థపై ఓ ఫ్రాడ్ కేసు దర్యాప్తులో భాగంగా UKలోని దాని ప్రధాన కార్యాలయంపై దాడులు జరిగాయి. 2022లో యూఏఈ మార్కెట్లోకి ప్రవేశించిన సెవెన్టీ నైన్త్ గ్రూప్.. పెట్టుబడిదారులకు వారి రుణాలపై అధిక రాబడిని ఆఫర్ చేసిన ఫ్రాడ్ కేసుపై లండన్ నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్లోని మెట్రోపాలిటన్ కౌంటీ అయిన మెర్సీసైడ్లోని ఐదు వేర్వేరు కంపెనీ బ్రాంచీలపై దాడుల జరిగాయి. ఆయా కార్యాలయాల నుంచి పెద్ద మొత్తంలో నగదు, లగ్జరీ గడియారాలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు.
కంపెనీ అసెట్స్ పై లోన్ నోట్లను విక్రయించడం ద్వారా పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని, £10,000 నుండి ప్రారంభమయ్యే రుణాలపై 12 - 15 శాతం మధ్య రాబడిని హామీ ఇస్తుందని ఫోర్స్ పేర్కొంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సెవెన్టీ నైన్త్ గ్రూప్ కెనడా, గినియాలో రియల్ ఎస్టేట్, అసెట్స్ నిర్వహణతోపాటు మైనింగ్ రంగంలో కూడా పనిచేస్తుంది. మరోవైపు తమ సంస్థలో ఎటువంటి తప్పులు జరగలేదని ఆరోపణలను కంపెనీ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, ఈ కేసుపై యూఏఈలోని వ్యాపార వర్గాలలో చర్చకు దారితీసింది. కంపెనీ ఆర్థిక లావాదేవీలలో పెట్టుబడిదారుల రక్షణ, నియంత్రణ పర్యవేక్షణపై ఆందోళనలను లేవనెత్తింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







