యూఏఈ కేంద్రగా పనిచేసే యూకే కంపెనీ మోసం పై విచారణ..!!
- March 10, 2025
యూఏఈ: యూఏఈలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న UKకి చెందిన అసెట్ మేనేజ్మెంట్ సంస్థపై ఓ ఫ్రాడ్ కేసు దర్యాప్తులో భాగంగా UKలోని దాని ప్రధాన కార్యాలయంపై దాడులు జరిగాయి. 2022లో యూఏఈ మార్కెట్లోకి ప్రవేశించిన సెవెన్టీ నైన్త్ గ్రూప్.. పెట్టుబడిదారులకు వారి రుణాలపై అధిక రాబడిని ఆఫర్ చేసిన ఫ్రాడ్ కేసుపై లండన్ నగర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్లోని మెట్రోపాలిటన్ కౌంటీ అయిన మెర్సీసైడ్లోని ఐదు వేర్వేరు కంపెనీ బ్రాంచీలపై దాడుల జరిగాయి. ఆయా కార్యాలయాల నుంచి పెద్ద మొత్తంలో నగదు, లగ్జరీ గడియారాలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు.
కంపెనీ అసెట్స్ పై లోన్ నోట్లను విక్రయించడం ద్వారా పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని, £10,000 నుండి ప్రారంభమయ్యే రుణాలపై 12 - 15 శాతం మధ్య రాబడిని హామీ ఇస్తుందని ఫోర్స్ పేర్కొంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సెవెన్టీ నైన్త్ గ్రూప్ కెనడా, గినియాలో రియల్ ఎస్టేట్, అసెట్స్ నిర్వహణతోపాటు మైనింగ్ రంగంలో కూడా పనిచేస్తుంది. మరోవైపు తమ సంస్థలో ఎటువంటి తప్పులు జరగలేదని ఆరోపణలను కంపెనీ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, ఈ కేసుపై యూఏఈలోని వ్యాపార వర్గాలలో చర్చకు దారితీసింది. కంపెనీ ఆర్థిక లావాదేవీలలో పెట్టుబడిదారుల రక్షణ, నియంత్రణ పర్యవేక్షణపై ఆందోళనలను లేవనెత్తింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







