సింగపూర్లోని చాంగీ విమానాశ్రయంలో రన్వేపై ఢీకొన్న విమానాలు
- March 30, 2017సింగపూర్లోని చాంగీ విమానాశ్రయంలో పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. రన్వేపై టేకాఫ్ అవుతున్న రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. అయితే పైలెట్లు అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పి.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
303 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో చైనాలోని టియాంజిన్ వెళ్తున్న స్కూట్ ఎయిర్లైన్ విమానం చాంగీ ఎయిర్పోర్టు రన్వేపై టేకాఫ్కు సిద్ధమైంది. ఇంతలో స్కూట్ విమానం లెఫ్ట్ వింగ్.. అదే రన్వేపై టేకాఫ్ చేసుకుంటున్న ఎమిరేట్స్ విమానాన్ని తాకాయి.
అయితే పైలెట్లు అప్రమత్తమై విమానాలను ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రయాణికులను దింపేసి.. దెబ్బతిన్న విమానాలను రిపేర్కు పంపించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు.
ఎమిరేట్స్ విమానం దుబాయికి వెళ్లాల్సి ఉంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు