ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- April 26, 2024
అమరావతి: ఆంధప్రదేశ్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారయింది. మే మూడు, నాలుగు తేదీల్లో ఆయన ఏపీలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మూడో తేదీన పీలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. నాలుగో తేదీన రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని చెబుతున్నారు. కీలకమైన విజయవాడలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. మే 3వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు పీలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 4వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు రాజమండ్రి సభలో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లిలో జరిగే ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కూటమి అభ్యర్థుల తరఫున మోడీ ప్రచారం చేయనున్నారు.
తాజా వార్తలు
- విమానాలలో పవర్ బ్యాంక్లపై సౌదీ అరేబియా నిషేధం..!!
- కువైట్లో ఎబోలా కేసులు లేవు..సరిహద్దుల వద్ద గట్టి భద్రత..!!
- బహ్రెయిన్ లో ప్రవాసుల కోసం వైద్య శిబిరం..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. ఖతార్, జోర్డాన్ కీలక చర్చలు..!!
- హోర్ముజ్లో ఇరాన్కు కొత్త అధికారాన్ని తిరస్కరించిన గల్ఫ్ దేశాలు..!!
- అభివృద్ధికి మద్దతు..ఒమన్ లో కొత్త పట్టణ ప్రణాళిక చట్టం..!!
- కాక్రోచ్ జనతా పార్టీ (CJP)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
- తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా..
- హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్..









