ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే

- April 26, 2024 , by Maagulf
ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే

అమరావతి: ఆంధప్రదేశ్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారయింది. మే మూడు, నాలుగు తేదీల్లో ఆయన ఏపీలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మూడో తేదీన పీలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. నాలుగో తేదీన రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని చెబుతున్నారు. కీలకమైన విజయవాడలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. మే 3వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు పీలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 4వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు రాజమండ్రి సభలో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లిలో జరిగే ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కూటమి అభ్యర్థుల తరఫున మోడీ ప్రచారం చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com