ఇటలీలో పెళ్లిచేసుకోనున్న విరాట్ - అనుష్క.!
- December 06, 2017టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్తార అనుష్క శర్మ ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరి మధ్య చాలా రోజులుగా సాగుతున్న ప్రేమాయణం ఎట్టకేలకు పరిణయంగా మారనుంది. వచ్చేవారం ఇటలీలో అంగరంగ వైభవంగా పెళ్లివేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయని ప్రచారం వినిపిస్తోంది.
9 నుంచి 12వ తేదీ దాకా నాలుగు రోజుల పాటు వివాహ వేడుకలు జరుగుతాయని, ఇందుకు ఇటలీలోని మిలాన్ నగరం వేదిక కాబోతోందని వినికిడి. పెళ్లివేడుక ఘనంగా జరుగుతుంది, మిత్రులు, సన్నిహితులను మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఇదివరకు వార్తలు వచ్చాయి. ఈ యేడాది ప్రారంభంలోనే డిసెంబర్ ముహూర్తాన్ని నిర్ణయించారన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అటు కోహ్లీ గానీ, ఇటు అనుష్క శర్మ వైపునుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలావుండగా, అనుష్క తరఫు ప్రతినిధి పెళ్లి వార్తను కొట్టిపారేశారు. ఇందులో నిజం లేదని, ఒట్టి పుకార్లేనని తేల్చిచెప్పాడు. కాగా, వారం రోజుల కిందట జరిగిన జహీర్ఖాన్ పెళ్లి వేడుకలో వీళ్లిద్దరు డ్యాన్స్ చేసి అలరించారు. అంతేకాదు, ఆర్పీ-ఎస్జీ గ్రూప్ పేరుతో క్రీడాకారులకు పురస్కారాలు అందించే కార్యక్రమాన్ని కోహ్లీ ప్రారంభించగా, ఇందుకు అనుష్క పూర్తిమద్దతు తెలిపింది. 2013 నుంచి వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ బహిరంగంగానే ప్రకటించాడు కూడా. కోహ్లీ ఆటను చూసేందుకు అనుష్కశర్మ దేశ, విదేశాలకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్