అమరావతి రైతుల సింగపూర్‌ టూర్‌

- February 18, 2018 , by Maagulf
అమరావతి రైతుల సింగపూర్‌ టూర్‌

అమరావతి: సింగపూర్‌ అభివృద్ధి విశేషాలను తెలుసుకునేందుకు సీఆర్డీయే ఆధ్వర్యంలో రాజధాని రైతుల మూడో బృందం ఆదివారం ఆ దేశ పర్యటనకు బయలుదేరింది. మొత్తం 39 మంది రైతులు వెలగపూడి సచివాలయం నుంచి బస్సులో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 23న వారు పర్యటన ముగించుకుని తిరిగి వస్తారు. పర్యటనలో అబ్బరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం, దొండపాడు, కృష్ణాయపాలెం, లింగాయపాలెం, మల్కాపురం, మందడం, నేలపాడు, నిడమర్రు, పెనుమాక, తుళ్లూరు, ఐనవోలు గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. వీరికి, సింగపూర్‌ అధికారులకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించేందుకు సీఆర్డీయే అధికారులు కూడా రైతులతో పాటు వెళ్లారు. ఇప్పటికే రెండు విడతలుగా 64మంది రైతులు సింగపూర్‌ పర్యటనకు వెళ్లి వచ్చారు. సింగపూర్‌ తరహాలో అమరావతి అభివృద్ధి చెందేలా రైతులు తోడ్పాటునందించేందుకు సీఆర్డీయే ఈ పర్యటనలు ఏర్పాటు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com