ఏషియన్ రెస్టారెంట్లో వ్యక్తి హత్య
- February 19, 201833 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి, ఆసియన్ రెస్టారెంట్లో హత్యకు గురయ్యాడు. నహ్దా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఏషియన్ రెస్టారెంట్లో పాకిస్తానీ వ్యక్తిని పలుమార్లుప పొడిచి చంపారు. మృతుడ్ని ఎంఎ ఖాన్గా గుర్తించాఉ. కిచెన్ నైఫ్తో అతన్ని చంపేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు సరదాగా మాట్లాడుకుంటుండగా, వారి మధ్య తగాదా ప్రారంభమయ్యిందనీ, ఈ క్రమంలోనే ఓ వ్యక్తి, మృతుడ్ని బలంగా పొడిచాడని తెలియవస్తోంది. పోలీసులు ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, సంఘటనా స్థలానికి వెళ్ళారు. ఫోరెన్సిక్, సీఐడీ, క్రైమ్ సీన్, పెట్రోల్, అంబులెన్స్ విభాగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. బాధితుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయింది. రెస్టారెంట్లో ఉన్నవారిని విచారించి, వివరాల్ని నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితుడి అరెస్ట్పై ఖచ్చితమైన సమాచారం లేదు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు