యూఏఈ ట్రావెలర్స్కి ఎమిరేట్స్ ఎర్లీ బర్డ్ ఆఫర్
- April 16, 2018ఎమిరేట్స్ ఎయిర్లైన్, స్పెషల్ ఎర్లీ బర్డ్ ఫేర్స్ని యూఏఈ ట్రావెలర్స్కి తమ గ్లోబల్ నెట్వర్క్లోని డెస్టినేషన్స్కిగాను ప్రకటించింది. నేటి నుంచి 30 ఏప్రిల్ వరకు అడ్వాన్స్గా టిక్కెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణీకులకు స్పెషల్ ఫేర్స్ వర్తిస్తాయని ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ పేర్కొంది. ఎకానమీ క్లాస్ ప్రయాణీకులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళేందుకోసం 795 దిర్హామ్లనుంచి ప్రయాణించే వీలుంది. యూరోప్కి ఈ ధరలు 2,135 దిర్హామ్ల నుంచి ప్రారంభమవుతాయి. వెస్ట్ ఏసియా, ఇండియన్ ఓసియన్కి సంబంధించి 945 దిర్హామ్ల నుంచి ధరలు ప్రారంభమవుతాయి. ఫార్ ఈస్ట్, ఆస్ట్రేలియాలకు 8,895 దిర్హామ్ల నుంచి టిక్కెట్ ధరలుంటాయి. అన్ని క్లాస్లలోనూ ప్రయాణించే ప్రయాణీకులకు 30 కిలోలు (ఎకానమీ), 40 కిలోలు (బిజినెస్) బ్యాగేజీ పొందవచ్చు. 19 ఏప్రిల్ నుంచి 13 డిసెంబర్ వరకు ప్రయాణాలకు ఈ స్పెషల్ ఫేర్స్ వర్తిస్తాయి.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు