ట్రాన్సిట్ ప్రయాణీకులకు యూఏఈ ఎంట్రీ వీసా
- April 16, 2018
మస్కట్: యూఏఈలోని దుబాయ్ లేదా అబుదాబీ మీదుగా ప్రయాణించే ట్రాన్సిట్ ప్రయాణీకులకు యూఏఈ ఎంట్రీ వీసాలను మంజూరు చేయనుంది. ట్రాన్సిట్ వీసా ద్వారా ప్రయాణీకులు యూఏఈలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్ని సందర్శించే వీలుంది. యూఏఈ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో, ట్రాన్సిట్ పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా వుండనుంది. యూఏఈలో టూరిజం సెక్టార్ని ప్రమోట్ చేసేందుకు, ఎకానమీని వృద్ధి చేసేందుకు ట్రాన్సిట్ వీసాలకు సంబంధించి కొత్త పాలసీని క్యాబినెట్ అప్రూవ్ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. యూఏఈ ఎయిర్ పోర్టుల ద్వారా 2017లో ప్రయాణించినవారిలో 70 శాతం మంది ట్రాన్సిట్ ప్రయాణీకులు. న్యూ పాలసీలో వీసా ఫీజు, స్టాప్ ఓవర్ విజిటర్స్ సంఖ్యను పెంచడం, అలాగే దేశంలోని టూరిజంని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







