24 రోజుల్లో 59 మంది టెర్రర్ అనుమానితుల అరెస్ట్
- April 18, 2018జెడ్డా:గడచిన 24 రోజుల్లో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనీ, సహకరిస్తున్నారనీ ఆరోపణల మేరకు 59 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ పేర్కొంది. వీరిలో 33 మంది సౌదీలు, 13 టర్కీలు, ఏడుగురు ఎమనీలు, ఇద్దరు ఈజిప్టియన్లు, ఇద్దరు ఆఫ్గాన్లు, ఓ కెన్యన్, ఓ నైజీరియన్ వున్నారు. తొలిసారిగా శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని మార్చి 7న అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 1న కెన్యాకి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫ్రెంచ్ వ్యక్తినీ, ఇద్దరు కెనడియన్లనీ, ఇద్దరు రష్యన్లనీ, ఐదుగురు అమెరికన్లనూ తీవ్రవాద నేరాభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. యెమనీసల్లో 320 మంది తీవ్రవాద అనుమానితులున్నారు. సిరియన్లు 206 మంది, పాకిస్తానీలు 79 మంది వున్నారు. మొత్తం 5305 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు నఫెతాహ్ వెబ్సైట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..