మధ్యప్రదేశ్:ఘోర రోడ్డు ప్రమాదం.. 22 మంది మృతి
- April 18, 2018
మధ్యప్రదేశ్ రాష్ట్రం సిధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి అనంతరం జరిగే రిసెప్షన్ వేడుక ముగించుకుని కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వస్తున్నారు. ఈక్రమంలో వారి వాహనం జోగ్దాహా బ్రిడ్జిపై వెళుతోంది. వేగంగా వెళుతున్న వాహనం బ్రిడ్జి గోడకి గుద్దుకోవడంతో సోన్ నదికి సుమారు 70 అడుగుల ఎత్తులో ఉన్న ట్రక్కు పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం స్థానికుల సహాయంతో గాలించగా స్పాట్లోనే 15 మంది మృతి చెందినట్లు, మరో 7గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుంటే మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేల సహాయాన్ని ప్రకటించినట్లు తెలియజేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







