మధ్యప్రదేశ్:ఘోర రోడ్డు ప్రమాదం.. 22 మంది మృతి
- April 18, 2018మధ్యప్రదేశ్ రాష్ట్రం సిధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి అనంతరం జరిగే రిసెప్షన్ వేడుక ముగించుకుని కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వస్తున్నారు. ఈక్రమంలో వారి వాహనం జోగ్దాహా బ్రిడ్జిపై వెళుతోంది. వేగంగా వెళుతున్న వాహనం బ్రిడ్జి గోడకి గుద్దుకోవడంతో సోన్ నదికి సుమారు 70 అడుగుల ఎత్తులో ఉన్న ట్రక్కు పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం స్థానికుల సహాయంతో గాలించగా స్పాట్లోనే 15 మంది మృతి చెందినట్లు, మరో 7గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుంటే మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేల సహాయాన్ని ప్రకటించినట్లు తెలియజేశారు.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి