మరో వారసుడు గల్లా అశోక్ ఎంట్రీకి రంగం సిద్ధం
- April 18, 2018టాలీవుడ్లో వారసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎందరో వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. ప్రస్తుతం అశోక్ అమెరికాలోని ఓ ఇన్స్టిట్యూట్లో నటనకి సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. మేలో ఈ కుర్రాడి సినిమా లాంఛనంగా ప్రారంభం కానుండగా, ఈ మూవీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణంలో రూపొందనున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ రాజమౌళి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన కృష్ణారెడ్డి గండదాసు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. మహేశ్ బావ సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'ఆడు మగాడ్రా బుజ్జి' అనే సినిమాను తెరకెక్కించారు కృష్ణారెడ్డి . అయితే అశోక్ చిత్రం శ్రీలంకలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని టాలీవుడ్ వెండితెరపై మరో సూపర్ స్టార్గా ఎదిగారు మహేష్ బాబు. ఆయన తనయుడు గౌతమ్ కూడా 1 నేనొక్కడినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఇక మహేష్ ఫ్యామిలీ నుండి సుధీర్ బాబు, మంజుల, ఆమె కూతురు జాన్వీ కూడా వెండితెరపై మెరిసారు. అయితే ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న అశోక్ తెలుగు ప్రేక్షకులని ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- కాన్సస్లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!