ఆంధ్రప్రదేశ్పైకి ప్రచండ అలలు
- April 24, 2018హైదరాబాద్ : ఆఫ్రికా ఖండ తీర ప్రాంతాల్లో వీస్తున్న ప్రచండ గాలుల వల్ల భారత తూర్పు తీరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు భారత జాతీయ సముద్ర సమాచార కేంద్రం (ఇన్కాయిస్) సవరించిన ప్రకటనను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ తమిళనాడు, కేరళ, లక్షద్వీప్లలోని తీర ప్రాంతాల్లో 3 నుంచి 4 మీటర్ల ఎత్తున్న రాకాసి అలలు విరుచుకుపడతాయని ఆదివారం ఇన్కాయిస్ హెచ్చరించింది. ఇదే పరిస్థితి ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి వరకూ కొనసాగుతుందని చెప్పింది. ముఖ్యంగా అండమాన్ నికోబార్, తమిళనాడు, ఒడిశా తీరాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో సముద్ర నీరు బాగా ముందుకు వచ్చింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఆదివారం కేరళ వచ్చిన పెను అలల తాకిడి తీర ప్రాంతాల్లోని 100 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోమ, మంగళవారాల్లో అలల తీవ్రత అండమాన్ నికోబార్లో ఎక్కువగా ఉంటుందని ఇన్కాయిస్ పేర్కొంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్