45,000 ఎలక్ట్రానిక్ వీసాలను జారీ చేసిన మస్కట్ ఎయిర్పోర్ట్
- April 24, 2018
మస్కట్: మార్చి 21 నుంచి ఏప్రిల్ 16 వరకు మొత్తం 45,000 ఎలక్ట్రానిక్ వీసలను జారీ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెల్లడించింది. దుబాయ్లోని అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఎటిఎం)లో ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, ఏటీఎంలో పాలుపంచుకుంటోంది. ఏప్రిల్ 22న దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఏటీఎం ప్రారంభమయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండర్ సెక్రెటరీ మైతా సైఫ్ అల్ మహ్రౌకి నాయకత్వంలో ఓ డెలిగేషన్ ఈ కార్యక్రమంలో పాల్గొంది. మైతా మాట్లాడుతూ, సుల్తానేట్లో టూరిజం డెవలప్మెంట్ కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనీ, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ప్రారంభం కూడా అందులో బాగమేనని చెప్పారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 16 వరకు 45,947 ఎలక్ట్రానిక్ వీసాలను మంజూరు చేశామని చెప్పారాయన. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ రెండో ఫేజ్ ప్రాజెక్ట్ శరవేగంగా పూర్తవుతోందని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!







