శ్రీదేవి తరుపున నేషనల్ అవార్డు అందుకోనున్న కూతురు ఖుషీ కపూర్
- May 02, 2018
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 65వ జాతీయ సినీ అవార్డుల్లో ప్రముఖనటి, దివంగత శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. 'మామ్' చిత్రంలో నటనకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
కాగా, జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేడు (మే 3) ఢిల్లీలో జరుగనుంది. శ్రీదేవి తరుపున ఆమె చిన్న కూతురు ఖుషీ కపూర్ ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఈ వేడుకకు శ్రీదేవి భర్త, 'మామ్' నిర్మాత బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్లతో కలిసి హాజరు కాబోతున్నారు.
శ్రీదేవి తన కెరీర్లో పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది మాత్రం 'మామ్' చిత్రానికే. దీన్ని అందుకోవడానికి తమ అభిమాన నటి లేక పోవడం విచారకరమని పలువురు ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
తన బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడి హోటల్ గదిలోని బాత్ టబ్లో ప్రమాదవ శాత్తు పడిపోయి మరణించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న దుబాయ్లో ఆమె మరణించగా, ఫిబ్రవరి 28న ఇండియాలో అంత్యక్రియలు నిర్వహించారు. అతిలోక సుందరి అంతిమ యాత్రలో లక్షలాది మంది అభిమానులు పాల్గొని నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!