ఆఫ్ఘనిస్తాన్:క్రికెట్ స్టేడియంలో వరుస బాంబు పేలుళ్లు.. 8 మంది మృతి
- May 19, 2018ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో 8 మంది మృతి చెందగా, 40మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్లోని తూర్పు ఆఫ్ఘాన్ నగరమైన జలాలాబాద్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
రంజాన్ మాసం ప్రారంభం కావటంతో జలాలాబాద్లో ఓ ఎన్జీవో సంస్థ నైట్టైమ్ టోర్నమెంట్ను నిర్వహించింది. శుక్రవారం మ్యాచ్ను వీక్షించేందుకు వందలాది మంది ప్రేక్షకులు క్రికెట్ స్టేడియానికి తరలివచ్చారు. మ్యాచ్ చూస్తూ కేరింతలు కొడుతుండగా ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో క్రికెటర్లు, ప్రేక్షకులు చెల్లాచెదురయ్యారు. భయంతో పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా, 40మందికి పైగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా క్రికెటర్లేనని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే చనిపోయినవారెవరో అధికారులు ఇంకా గుర్తించలేదు.
మూడు శక్తివంతమైన బాంబులు పేలాయని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు 'అష్రఫ్ ఘని' ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!