రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- May 02, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. హైదరాబాద్ నిర్ధేశించిన 202 పరుగుల టార్గెట్తో ఛేజింగ్కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 1 పరుగుతేడాతో గెలుపొందింది.
రాజస్థాన్ బ్యాటర్లు రియాన్ పరాగ్ (77), యశస్వి జైస్వాల్ (67) చేలరేగినప్పటికీ ఫలితం లేకుండా పొయింది. షిమ్రాన్ హెట్మెయర్ 13, రోవ్మన్ పావెల్ 27 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, టి నటరాజన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో ఐదవ స్థానంలో ఉన్న ఎస్ఆర్హెచ్… నాల్గవ స్థానానికి చేరుకుంది.
తాజా వార్తలు
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!









