రాజస్థాన్ రాయల్స్‌ పై సన్ రైజర్స్ దే విజయం

- May 02, 2024 , by Maagulf
రాజస్థాన్ రాయల్స్‌ పై సన్ రైజర్స్ దే విజయం

హైదరాబాద్: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. హైదరాబాద్ నిర్ధేశించిన 202 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 1 పరుగుతేడాతో గెలుపొందింది.

రాజస్థాన్‌ బ్యాటర్లు రియాన్‌ పరాగ్ (77), యశస్వి జైస్వాల్ (67) చేలరేగినప్పటికీ ఫలితం లేకుండా పొయింది. షిమ్రాన్ హెట్మెయర్ 13, రోవ్‌మన్ పావెల్ 27 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇక హైదరాబాద్ బౌలర్ల‌లో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయ‌గా.. పాట్ కమిన్స్, టి నటరాజన్ చెరో రెండు వికెట్లు ద‌క్కించుకున్నారు. ఇక ఈ విజయంతో పాయింట్స్‌ టేబుల్‌లో ఐదవ స్థానంలో ఉన్న ఎస్‌ఆర్‌‌హెచ్‌… నాల్గవ స్థానానికి చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com