మరో చిత్రానికి హీరో ధనుష్‌ దర్శకత్వం

- May 23, 2018 , by Maagulf
మరో చిత్రానికి హీరో ధనుష్‌ దర్శకత్వం

'పవర్‌పాండి' చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ మరోసారి మెగా ఫోన్‌ పట్టబోతున్నారు. సీనియర్‌ నటుడు రాజ్‌కిరణ్‌తో ధనుష్‌ చేసిన 'పవర్‌పాండి' కమర్షియల్‌ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. దాంతో, ఆ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రీమేక్‌ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో 'పవర్‌ పాండి'కి సీక్వెల్‌ తీయబోతున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, హాలీవుడ్‌ చిత్రంలో ధనుష్‌ బిజీ అవడంతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో నటిస్తుండడం వల్ల మెగాఫోన్‌కు దూరంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ధనుష్‌ మరోసారి దర్శకత్వం వహించేందుకు సన్నా హాలు చేపట్టినట్టు కోలీవుడ్‌ టాక్‌. వచ్చే నెలలోనే ఆ సినిమా ప్రారం భమయ్యే అవకాశముందని చెప్పు కుంటున్నారు. అయితే, వేరే ఆ సినిమాలో వేరే హీరో నటిస్తారా లేక ధనుష్‌ నటిస్తారా అన్నది ఇంకా తెలియలేదు. కాగా, ధనుష్‌ నటించిన హాలీవుడ్‌ చిత్రం 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌' జూలైలో తెరపైకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com