మరో చిత్రానికి హీరో ధనుష్ దర్శకత్వం
- May 23, 2018'పవర్పాండి' చిత్రంతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నారు. సీనియర్ నటుడు రాజ్కిరణ్తో ధనుష్ చేసిన 'పవర్పాండి' కమర్షియల్ సక్సెస్తో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. దాంతో, ఆ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో 'పవర్ పాండి'కి సీక్వెల్ తీయబోతున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, హాలీవుడ్ చిత్రంలో ధనుష్ బిజీ అవడంతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో నటిస్తుండడం వల్ల మెగాఫోన్కు దూరంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ధనుష్ మరోసారి దర్శకత్వం వహించేందుకు సన్నా హాలు చేపట్టినట్టు కోలీవుడ్ టాక్. వచ్చే నెలలోనే ఆ సినిమా ప్రారం భమయ్యే అవకాశముందని చెప్పు కుంటున్నారు. అయితే, వేరే ఆ సినిమాలో వేరే హీరో నటిస్తారా లేక ధనుష్ నటిస్తారా అన్నది ఇంకా తెలియలేదు. కాగా, ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' జూలైలో తెరపైకి రానుంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు