యు.ఏ.ఈ:వాట్సాప్ వాయిస్ నోట్పై హెచ్చరిక
- May 25, 2018యు.ఏ.ఈ:వాట్సాప్ వంటి యాప్ల ద్వారా టెక్స్ మెసేజ్లను పంపి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు అక్రమార్కులు. తాజాగా వీరు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. వాట్సాప్లో వాయిస్ నోట్ ద్వారా అమాయకుల్ని మోసం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. 200,000 దిర్హామ్లు గెల్చుకున్నారంటూ యూఏఈలోని ప్రముఖ హైపర్ మార్కెట్ ఛెయిన్ పేరుతో వాయిస్ నోట్స్ని సర్క్యులేట్ చేస్తున్నారు. లులు హైపర్ మార్కెట్ పేరుతో ఈ దుష్ప్రచారం జరుగుతోంది. అయితే లులు సంస్థ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. లులు సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టబోదని ఆ సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది. తమ సంస్థ నుంచి ఎవరూ ఫోన్ చేయడంగానీ, టెక్స్ట్ మెసేజ్లు చేయడంగానీ, వాయిస్ నోట్స్ పంపడంగానీ జరగదనీ, అలా ఎవరైనా ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్, బ్యాంక్ డిటెయిల్స్ అడిగితే తమకు సంబంధం లేదని లులు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం