ఫేక్ బాంబ్: అన్నదమ్ములకు జైలు
- May 25, 2018
మనామా: హై క్రిమినల్ కోర్ట్ ఇద్దరు అన్నదమ్ములకు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఫేక్ బాంబ్ని ప్లాంట్ చేయడం ద్వారా పబ్లిక్ పీస్ని దెబ్బతీసేందుకు వీరు ప్రయత్నించినట్లు అభియోగాలు నిరూపించబడ్డాయి. జైలు శిక్షతోపాటు, వీరి పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వీరిపై తీవ్రవాద నేరాభియోగాలు మోపబడ్డాయి. రద్దీగా వుండే ప్రాంతంలో బాంబుని పోలి వుండే వస్తువుని వీరు వుంచగా, భయపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాంబ్ ఎక్స్పర్ట్స్తో ఆ వస్తువుని పరీక్షింపజేసి, దాన్ని ఫేక్ బాంబుగా తేల్చారు. ఆ వస్తువు నుంచి ఫింగర్ ప్రింట్స్ సేకరించగా, అవి నిందితుడి ఫింగర్ ప్రింట్స్తో సరిపోయాయి. ఈ కేసులో ఇంకో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







